Malkajgiri Roadshow : హైదరాబాద్ మల్కాజ్గిరిలో కాంగ్రెస్ పార్టీ రోడ్ షో నిర్వహించింది. ఈ రోడ్ షో లో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పాల్గొన్నారు. ఆనంద్ బాగ్ నుంచి రోడ్ షో మొదలైంది. భారీగా కార్యకర్తలు , నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి మైనంపల్లి హనుమంతరావుకు మద్దతుగా రాహుల్, ప్రియాంక ప్రచారం చేపట్టారు.
తెలంగాణ ప్రజలతో తనకు ఎంతో అనుబంధం ఉందని రాహుల్ గాంధీ అన్నారు. ప్రేమతో కూడిన భారత్ మనకు కావాలన్నారు. కాంగ్రెస్ ఓట్లు చీల్చేందుకు ఎంఐం చూస్తోందని ఆరోపించారు. రోడ్ షో ముగిసిన తర్వాత రాహుల్ గాంధీ సెల్ఫీ దిగారు. రేవంత్ రెడ్డి, ప్రియాంక గాంధీలతో సెల్ఫీ తీసుకున్నారు.