Hemant Soren ED Notice : ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్కు ఈడీ సమన్లు జారీ అయ్యాయి. మైనింగ్ లీజుకు సంబంధించి మనీ లాండరింగ్ కేసులో ఆయనకు ఈ నోటీసులు జారీ చేశారు. రాంచీలోని ఈడీ కార్యాలయానికి ఈ నెల 3న హాజరు కావాలని సొరెన్కు పంపని నోటీసులో పేర్కొన్నారు అధికారులు. ఇదే కేసులో సీఎం రాజకీయ ప్రతినిధి పంకజ్ మిశ్రాతోపాటు మరో వ్యక్తిని అరెస్ట్ చేశారు.
మహారాష్ట్ర తరువాత ఇప్పుడు ఝార్ఖండ్ రాజకీయాలు హాట్ టాపిక్కా మారాయి. ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ సీఎంవో ఆఫీనస్ను అక్రమాలకు, మనీలాండరింగ్కు ఉపయోగించారని బీజేపీ నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. సొరెన్ పై అనర్హత వేటు వేయాలని బీజేపీ నేతలు ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ అంశంపై ఈసీ తన నిర్ణయాన్ని గవర్నర్కు ఈ నెల 25న పంపింది.
జులైలో ఈడీ అధికారులు దేశవ్యాప్తంగా అనేక చోట్ల రైడ్స్ చేపట్టారు. ఝార్ఖండ్లో కూడా ఈడీ రైడ్స్ చేసింది. అప్పుడు ముఖ్యమంత్రి సొరెన్ సంతకం చేసిన పాస్ బుక్స్, చెక్స్ స్వాధీనం చేసుకున్నారు. అయితే గవర్నర్ రమేష్ బైస్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు రజకీయ దుమారం రేపాయి. ‘ఝార్ఖండ్లో ఎప్పుడైనా అణుబాంబ్ పేలవచ్చు’ అని ఆయన చేసిన కామెంట్స్ సంచలనం సృష్టించాయి.