Khammam Politics : ఉమ్మడి ఖమ్మం జిల్లా తెలంగాణ రాజకీయాలకు కేంద్రంగా మారింది. అన్ని పార్టీలు ఈ జిల్లాపైనే ఫోకస్ పెట్టాయి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు చేరికతో కాంగ్రెస్ మరింత బలపడింది. పొంగులేటి పోటీస్తున్న పాలేరు.. తుమ్మల బరిలోకి దిగిన ఖమ్మం స్థానాలపై అందరి దృష్టి ఉంది. మధిర నియోజకవర్గం నుంచి వరుసగా నాలుగో సారి గెలిచేందుకు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ప్రయత్నిస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో క్లీన్ స్వీప్ చేస్తామని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. కారు ఖాతా తెరవదంటున్నారు. మరి ఓటరు తీర్పు ఎలా ఉంటుందో చూడాలి.