Nizamabad Politics : ఉమ్మడి నిజామాబాద్ జిల్లా తెలంగాణ ఎన్నికల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇక్కడ ఫలితాలు కీలకంగా మారనున్నాయి. ఈ జిల్లాలోని కామారెడ్డి నుంచి సీఎం కేసీఆర్ పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పోటీకి దిగడం ఆసక్తిగా మారింది. దీంతో కామారెడ్డి ఫలితంపై ఎంతో ఆసక్తి నెలకొంది. బాల్కొండలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి కాంగ్రెస్ అభ్యర్థి సునీల్ కుమార్ నుంచి గట్టి పోటీ ఉంది. బాన్సువాడలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి ఏనుగు రవీందర్ రెడ్డి మధ్య గట్టిపోటీ ఉందంటున్నారు. మొత్తంమీద ఉమ్మడి నిజామాబాద్ లో కారుకు బ్రేకులు పడతాయనే టాక్ నడుస్తోంది.
ఆర్మూర్– జీవన్ రెడ్డి (బీఆర్ఎస్) – వినయ్ కుమార్ (కాంగ్రెస్)- పైడి రాకేష్ రెడ్డి (బీజేపీ)
బోధన్ -షకీల్ (బీఆర్ఎస్)-సుదర్శన్ రెడ్డి (కాంగ్రెస్) – వడ్డి మోహన్ రెడ్డి(బీజేపీ)