EPAPER

Kaushik Reddy : గెలిపిస్తారా.. శవయాత్రకు వస్తారా ? బీఆర్ఎస్ అభ్యర్థి కౌశిక్ రెడ్డి బ్లాక్ మెయిల్

Kaushik Reddy : గెలిపిస్తారా.. శవయాత్రకు వస్తారా ? బీఆర్ఎస్ అభ్యర్థి కౌశిక్ రెడ్డి బ్లాక్ మెయిల్
Padi Kaushik reddy news

Padi Kaushik reddy news(Political news in telangana) :

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తుది పోలింగ్ కు సమయం దగ్గర పడుతున్న కొద్దీ.. అభ్యర్థుల్లో టెన్షన్ పెరిగిపోతోంది. ఈ ఎన్నికల్లో ప్రధానంగా బీఆర్ఎస్ – కాంగ్రెస్ ల మధ్య పోటీ పడుతున్నాయి. ప్రచారానికి మరికొద్ది గంటల్లో ఎండ్ కార్డ్ పడనుండటంతో.. అభ్యర్థులు ప్రచార జోరును పెంచారు.


హుజురాబాద్‌లో బీఆర్ఎస్ అభ్యర్ధి కౌశిక్ రెడ్డి ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. తనకే ఓట్లు వేసి గెలిపించాలని అలా చేస్తే విజయ యాత్రకు వస్తానని.. లేకుంటే డిసెంబర్ 4వ తేదీన శవయాత్రకు రావాల్సి ఉంటుందని ఓటర్లను బెదిరిస్తూ స్పీచ్ లు ఇస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కమలాపూర్ గ్రామంలో కౌశిక్ రెడ్డి ఈ రకమైన బెదిరింపులకు దిగారు.

తనకు ఓటు వేయకపోతే నాలుగో తేదీన శవయాత్ర ఉంటుందని కౌశిక్ రెడ్డి బెదిరిపులకు దిగారు. ఎన్నికల్లో తనను ఓడిస్తే ముగ్గురి శవాలను చూడాల్సి ఉంటుందని కౌశిక్ రెడ్డి ఓటర్లను ఎమోషనల్‌గా బెదిరిస్తున్నారు.


కౌశిక్ రెడ్డి సెంటిమెంట్‌ రగిలించి ఎన్నికల్లో గెలవలాని చూస్తున్నారని ఓటర్లు మండిపడుతున్నారు. ఈ ఎన్నికల్లో ఓటమి ఖాయమని తేలడంతో కౌశిక్ రెడ్డి ఇలాంటి ఎత్తుగడ వేశారంటూ కాంగ్రెస్ అభ్యర్ధి మండిపడుతున్నారు. ఓటర్లను బెదిరిస్తున్న కౌశిక్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఈసీని కోరుతున్నారు.

Related News

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Telangana in Debt Trap | తెలంగాణ ఆర్థిక పరిస్థితి దయనీయం.. రుణ వడ్డీల చెల్లింపులకే భారీగా ఖర్చు

ABP C Voter Survey Telangana | బీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా లోక్‌సభ ఎన్నికల సర్వే..

BRS Dark Secrets | బిఆర్ఎస్ పాలనలోని జీవో ఫైళ్లు మాయం.. రహస్య జీవోలతో కేసీఆర్ దాచినదేమిటి?

BJP : బీజేఎల్పీ నేత ఎవరు? రాజాసింగ్ కే ఇస్తారా?

Telangana Assembly Speaker : స్పీకర్‌ పదవికి గడ్డం ప్రసాద్‌ నామినేషన్‌.. బీఆర్ఎస్ మద్దతు..

Big Stories

×