ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 12 అసెంబ్లీ స్థానాలున్నాయి. ధర్మపురి నుంచి మంత్రి కొప్పుల ఈశ్వర్ , మంథని కాంగ్రెస్ సీనియర్ నేత శ్రీధర్ బాబు పోటీ చేస్తున్నారు. కరీంనగర్ నుంచి మంత్రి గంగుల కమలాకర్, బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ బరిలో ఉండటం ఆసక్తిగా మారింది. సిరిసిల్లలో మంత్రి కేటీఆర్, కాంగ్రెస్ అభ్యర్థి కేకే మహేంద్ర రెడ్డి మధ్య గట్టి పోటీ ఉంటుందంటున్నారు. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ పోటీ చేస్తున్న హుజురాబాద్ నియోజకవర్గంపై అందరి దృష్టి ఉంది. కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి జగిత్యాల నుంచి బరిలో ఉన్నారు. ఆయన గెలుపుపై నమ్మకంతో ఉన్నారు.