MLC Jayamangala VenkataRamana | ఆంధ్ర ప్రదేశ్లోని ఉమ్మడి కృష్ణా జిల్లా ఎమ్మెల్సీ వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుడు జయమంగళ వెంకట రమణ మూడో వివాహం చేసుకున్నారు. ఏలూరు రేంజ్ అటవి శాఖలో ఆఫీసర్గా పనిచేస్తున్న సుజాతను సంప్రదాయంగా పెళ్లి చేసుకున్నారు.
ఆంధ్ర ప్రదేశ్లోని ఉమ్మడి కృష్ణా జిల్లా ఎమ్మెల్సీ వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుడు జయమంగళ వెంకట రమణ మూడో వివాహం చేసుకున్నారు. ఏలూరు రేంజ్ అటవి శాఖలో ఆఫీసర్గా పనిచేస్తున్న సుజాతను సంప్రదాయంగా పెళ్లి చేసుకున్నారు.
కైకలూరు సబ్ రిజిస్టర్ ఆఫీసులో సోమవారం ఉదయం ఈ వివాహం జరిగింది. కైకలూరు సబ్ రిజిస్ట్రార్ దుర్గా రాణి వివాహ ధ్రువీకరణ పత్రాన్ని నూతన దంపతులకు అందజేశారు. ఈ వివాహంలో విశేషమేమిటంటే.. ఎమ్మెల్సీ జయ మంగళ రెండో భార్య సునీత ఈ వివాహానికి సాక్షి సంతకం చేశారు. సునీత, వెంకటరమణల కుమారుడు కూడా ఈ వివాహానికి వచ్చాడు. ఒక ఎమ్మల్సీ మూడో పెళ్లికి అతని రెండో భార్య సాక్షిగా సంతకం చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది.
ఎమ్మెల్సీ వెంకటరమణ మొదటి భార్య అనారోగ్యంతో చనిపోవడంతో ఆయన సునీతను రెండో వివాహం చేసుకున్నారు. వెంకటరమణ, సునీతకు ఒక కొడుకు, ఒక కుమార్తె సంతానం. ఆ తరువాత కుటుంబ కలహాల కారణంగా ఇద్దరూ విడాకులు తీసుకున్నారు.
ఫారెస్ట్ ఆఫీసర్ సుజాతకు కూడా ఇంతకుముందు వివాహం జరిగింది. ఆమెకు ఒక కుమారుడు ఉన్నాడు. అయితే ఎమ్మెల్సీ వెంకటరమణ తాజాగా సుజాతను మూడో పెళ్లి చేసుకున్నారు.