Modi Road Show : బీజేపీ హైదరాబాద్లో భారీ రోడ్ షో చేపట్టింది. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఆర్టీసీ క్రాస్రోడ్స్ నుంచి రోడ్ షో ప్రారంభమైంది. అక్కడ నుంచి కాచిగూడ వరకు 2 కిలోమీటర్ల మేర బీజేపీ ప్రచారం సాగింది. ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు అభివాదం చేస్తూ మోదీ ముందుకు సాగారు.
ప్రధానికి అడుగడుగునా కాషాయ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. మోదీపై కార్యకర్తలు పూల వర్షం కురిపించారు. ఈ రోడ్ షోలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్రెడ్డి, ఎంపీ లక్ష్మణ్ కూడా పాల్గొన్నారు. ఈ సమయంలో పోలీసులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.
రోడ్డుకు ఇరువైపులా బారికేడ్లు ఏర్పాటు చేసి భద్రతా చర్యలు చేపట్టారు. చిక్కడపల్లి, నారాయణగూడ మెట్రో స్టేషన్లను అధికారులు తాత్కాలికంగా కొంతసమయం మూసివేశారు.