Junior NTR Cleaning Chairs : జునియర్ ఎన్టీఆర్ తన మ్యానరిజమ్స్తో ఫ్యాన్స్ మనుసులను మాత్రమే కాదు.. అందరి మన్నలను పొందుతున్నాడు. తాజాగా కర్నాటకలో ‘కర్నాటక రాజ్యోత్సవ’ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి సూపర్ స్టార్ రజినీకాంత్తో పాటు.. జునియర్ ఎన్టీఆర్, పునీత్ రాజ్ కుమార్ ఫ్యామిలీ, కర్నాటక సీఎం బసవరాజ్ బొమ్మై, మరికొందరు ప్రముఖులు హాజరయ్యారు.
సభ ప్రారంభ సమయంలో వర్షం పడింది.. దీంతో అక్కడున్న కుర్చీలు తడిసిపోయాయి. అప్పుడు ఎన్టీఆర్ స్వయంగా అక్కడున్న కుర్చీలను తుడిచి పునీత్రాజ్కుమార్ భార్య అశ్వినీని కూర్చొబెట్టారు. ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి సతీమణి సుధామూర్తిని కుర్చీని కూడా తుడిచి కూర్చోబెట్టారు. తరువాత తన కూర్చీని తుడుచుకొని కూర్చున్నారు. ఈ దృష్యం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కర్నాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ఈ వీడియోను తన అధికారిక ట్విట్టర్ అకౌంట్ ద్వారా పోస్ట్ చేశారు. ఈ కార్యక్రమంలో పునీత్ రాజకుమార్కు కర్నాటక రత్న అనే పురస్కారాన్ని కర్నాటక ప్రభుత్వం అందించింది.