PM Modi : తెలంగాణను కాంగ్రెస్, బీఆర్ఎస్ నాశనం చేశాయని ప్రధాని మోదీ విమర్శించారు. మహబూబాబాద్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన మోదీ.. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. మంత్రివర్గంలో అన్ని వర్గాలకు సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వస్తే తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తామన్నారు.
గతంలో కేసీఆర్ ఢిల్లీకి వచ్చి బీజేపీతో చర్చలు జరిపారని మోదీ వెల్లడించారు. బీజేపీతో కలుస్తామని అడిగారని .. తన వారసుడిని సీఎంగా చేస్తే బీజేపీతో కలుస్తామని కేసీఆర్ కోరారన్నారు. కేసీఆర్ విజ్ఞప్తిని తాము తిరస్కరించామన్నారు. అప్పటి నుంచే బీజేపీని బీఆర్ఎస్ అధినేత తిట్టడం మొదలుపెట్టారని మండిపడ్డారు. అంధ విశ్వాసాలను నమ్మి సచివాలయాన్ని కూల్చారని విమర్శించారు. తెలంగాణలో బీజేపీని గెలిపించాలని ప్రజలకు మోదీ పిలుపునిచ్చారు.
.
.
.