Triple Roles : తెరపై తమ అభిమాన హీరో ఒక పాత్రలో కనిపిస్తేనే అభిమానుల్లో పూనకం వచ్చేస్తుంది. అలాంటిది తమ అభిమాన హీరోలు త్రిపాత్రాభినయం చేస్తే.. ఇక వారి ఆనందానికి అవధులు ఉండవు. తెలుగు సినీ చరిత్రలో ఒకే సినిమాలో మూడు పాత్రల్లో నటించి, మెప్పించిన హీరోలెవరో చూద్దాం.
జూనియర్ ఎన్టీఆర్
ఎన్టీఆర్ హీరోగా 2017లో విడుదలైన ‘జై లవ కుశ’ మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. ఈ మూవీలో తారక్.. జై, లవ, కుశ అనే ముగ్గురి కవల సోదరుల పాత్రల్లో నటించారు. అందులో జై.. విలన్ పాత్రలో కనిపిస్తాడు.
కళ్యాణ్ రామ్
కళ్యాణ్ రామ్ తొలి ట్రిపుల్ రోల్స్ సినిమా ‘అమిగోస్’. ఈ ఎడాది(2023) మొదట్లో విడుదలైన ఈ సినిమా హిట్ కాలేకపోయినా.. కళ్యాణ్ రామ్ నటన అద్భుతం అనిపించింది. ఇందులో మంజునాథ్, సిద్ధార్థ్, మైఖేల్ అనే పాత్రల్లో నటించారు. మైఖేల్ విలన్గా కనిపిస్తాడు.
సూర్య
‘సింగం’ సినిమాలతో టాలీవుడ్లో భారీగా అభిమానులను సంపాదించుకున్న తమిళ హీరో సూర్య. టైం ట్రావెల్ కాన్సెప్ట్తో సూర్య అలరించిన ‘24’ సినిమాలో తండ్రి (సేతురామన్)గా, కొడుకు (మణి)గా, పెదనాన్న (ఆత్రేయ)గా మూడు విభిన్న పాత్రల్లో కనిపించాడు. ఇందులో పెదనాన్న (ఆత్రేయ) విలన్..
సంపూర్ణేష్ బాబు
ఎలాంటి సపోర్ట్ లేకుండా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన హీరో సంపూర్ణేష్ బాబు. 2019లో విడుదలైన ‘కొబ్బరి మట్ట’ సినిమాలో సంపూర్ణేష్ బాబు మూడు పాత్రల్లో నటించారు. తాత, తండ్రి, కొడుకుగా ట్రిపుల్ రోల్స్ చేసి నవ్వులు పూయించారు సంపూ.