Bijli Mahadev Temple : అంతరిక్షంలో జీవం కోసం వెతికేంతగా పెరిగిన సైన్స్.. మన భారతదేశంలో జరిగే కొన్ని సంఘటనలకు మాత్రం సమాధానం చెప్పలేకపోతుంది. వాటిలో హిమాచల్ ప్రదేశ్లోని కులూ వ్యాలీలో ఉన్న ‘బిజిలి మహాదేవ్ ఆలయం’ కూడా ఒకటి. ఈ ఆలయం సైన్స్కు ఒక మిస్టరీ. మరి ఆ మిస్టరీ ఏంటో తెలుసుకుందామా!
శివలింగం తునాతునకలు..
సముద్ర మట్టానికి 2 వేల 450 మీటర్ల ఎత్తులో ఉన్న ఒక కొండపై ఈ ఆలయం ఉంటుంది. సరిగ్గా ప్రతి 12 ఏళ్లకు ఒకసారి ఈ ఆలయంలోని శివలింగంపై పిడుగు పడుతుందట. ఆ పిడుగు దెబ్బకు భారీ శబ్దంతో శివలింగం తునాతునకలు అవడంతో పాటు కొండలు కంపిస్తాయట.
యధారూపంలోకి.. శివలింగం
ఈ ఆలయంపై పిడుగు పడినా ఆలయం చెక్కు చెదరదు. అంతేకాదు.. పిడుగు పడిన మరుసటి రోజు గుడికి వెళ్లిన పూజారి శివలింగం ముక్కలను దగ్గరకు చేర్చి అభిషేకం చేసిన కొన్ని గంటల్లోనే శివలింగం యధారూపంలోకి వస్తుందట. ఇది ఎలా జరుగుతుందో ఇప్పటికీ శాస్త్రవేత్తలు సమాధానం చెప్పలేకపోతున్నారు.