Ayodhya Bell : అయోధ్య రాముడికోసం 2500 కిలోల భారీ గంటను సిద్ధం చేసి విరాళంగా ఇచ్చేందుకు ఉత్తరప్రదేశ్ కు చెందిన ఓ కుటుంబం సిద్ధమైంది. ఈ గంటను తయారు చేసేందుకు అక్షరాలా రూ.25 లక్షలు ఖర్చు చేస్తున్నట్లు ఇటావా జిల్లాకు చెందిన గంటలు తయారు చేసే మిత్తల్ కుటుంబం పేర్కొంది. గంటను మోగించినపుడు.. టంగ్ అని కాకుండా ఓంకాంరం శబ్దం రావడం దీని ప్రత్యేకత అని తెలిపారు. ఈ గంటను జిక్, రాగి, సీసం, తగరం, నికెల్, వెండి, బంగారం వంటి 8 లోహాలతో తయారు చేసినట్లు తెలిపారు. గంటను తయారు చేసేందుకు మూడు నెలల సమయం పట్టగా.. 250 మంది కార్మికులు పాల్గొన్నట్లు వివరించారు.
కాగా.. 2020 అక్టోబర్ లో 613 కేజీల బరువైన గంటను చెన్నైకి చెందిన న్యాయహక్కుల మండలి ప్రధాన కార్యదర్శి రాజ్యలక్ష్మి మండా ఆలయ ట్రస్టు సభ్యులకు అందజేశారు. 4.13 అడుగుల పొడవు, 3.9 అడుగుల వెడల్పు ఉన్న ఆ గంటపై సీతా, రామ, లక్ష్మణ, హనుమంతుడు, వినాయకుడి ప్రతిమలతో పాటు.. జైశ్రీరామ్ అనే అక్షరాలను చెక్కారు. ఈ గంటను మోగించినపుడు ఓంకారం శబ్ధం వినిపిస్తుందని అప్పట్లో భక్తులు వెల్లడించారు.