Jangaon : జనగామ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. మంత్రి ఎర్రబెల్లి ప్రచార రథం, 9 ఏళ్ల బాలిక ప్రాణాలు తీసింది. కొడకండ్ల మండలం నీలిబండ తండాకు మంత్రి ఎర్రబెల్లి ప్రచార రథం వెళ్లింది. ఆ తండాలోని కొందరు చిన్నారులు సరదాగా ఆ ప్రచారం రథంపైకి ఎక్కారు. పిల్లలను గమనించకుండా ప్రచార రథాన్ని డ్రైవర్ అతివేగంతో నడపడంతో… 9 ఏళ్ల అంజలి నాయక్ కింద పడిపోయింది. ఈ ప్రమాదంలో అంజలి తలకు తీవ్ర గాయాలయ్యాయి.
చిన్నారిని వెంటనే నార్కట్పల్లి కామినేని ఆస్పత్రికి తరలించినా లాభం లేకపోయింది. చికిత్స పొందుతూ చిన్నారి కన్నుమూసింది. ఇది మంత్రి చేసిన హత్యే అంటూ గిరిజన సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. బాధిత కుటుంబానికి పరిహారం ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు.