Rahul Gandhi Sangareddy : తెలంగాణ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతుంది. రాహుల్ గాంధీ వరుస సభలతో తెలంగాణ ప్రజానీకాన్ని ఉత్తేజపరుస్తున్నారు. ఈ సందర్భంగా సంగారెడ్డి బహిరంగ సభలో పాల్గొన్న అయన ప్రభుత్వం పై విమర్శలు గుప్పించారు. తాము అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలను అమలుపరుస్తాం అని తెలిపారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఆరు గ్యారంటీలకు చట్టాలు తీసుకొస్తాం అని పేర్కొన్నారు. మొదటి కాబినెట్ సమావేశంలోనే ఇవి కచ్చితంగా అమలుచేస్తాం అని తెలిపారు. ఈ సందర్భంగా బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం మూడు ఒకటే అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఢిల్లీలో మోదీకి కెసిఆర్ మద్దతు ఉంటుంది.. తెలంగాణాలో కేసీఆర్ కు మోదీ మద్దతు ఉంటుంది అని తెలిపారు.
ప్రభుత్వం మీద పోరాడుతున్నందుకు తనకు మిగిలింది 24 కేసులని తెలిపారు. బీజేపీ కుట్రలో భాగంగా తన లోక్ సభ సభ్యత్వాన్ని కూడా కోల్పోయానని.. ఉన్న ఇల్లు కూడా ప్రభుత్వం లాగేసుకుంది అని తెలిపారు.అయినా తనకు కోట్లాది ప్రజల గుండెల్లో చోటుందని తెలిపారు. ఇక్కడ ఎలాగైనా కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించుతాం అని పేర్కొన్నారు. అలాగే ఢిల్లీలో మోదీని దించి కాంగ్రెస్ జెండా ఎగురవేస్తాం అని స్పష్టం చేశారు. సంగారెడ్డిలో జగ్గారెడ్డిని గెలిపించాలని కోరారు.
.
.
.