Rahul Chitchat : హైదరాబాద్ అశోక్ నగర్ చౌరస్తాలో, రాహుల్ గాంధీ స్టూడెంట్స్ తో చిట్ చాట్ చేశారు. చాయ్ తాగుతూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నియామకాల నినాదంతో ఏర్పడిన తెలంగాణలో కలలు నెరవేరలేదని రాహుల్ తెలిపారు. ప్రిపరేషన్ లోనే ఏళ్లకు ఏళ్లు గడిచిపోతున్నాయని స్డూడెంట్స్ రాహుల్ కు మొరపెట్టుకున్నారు. సడెన్గా విద్యార్థులను కలిసేందుకు వెళ్లి వారందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు.
సెక్యూరిటీ గురించి కూడా ఆలోచించకుండా స్టూడెంట్స్ మధ్యకెళ్లి వాళ్లతో ముచ్చటించారు. ఒత్తిడితో కొందరు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పేపర్ లీకులు తప్ప.. పరీక్షల్లేవని ప్రభుత్వంపై మండిపడ్డారు. అనంతరం స్థానిక బావర్చీ హోటల్లో సందడి చేశారు. ఈ విషయాన్ని రాహుల్ X లో నెటిజన్లతో పంచుకున్నారు.
“హైదరాబాద్లోని అశోక్నగర్లో వివిధ పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతోన్న యువతను నేను కలిశాను. తెలంగాణ వస్తే తమకు కొలువులు వస్తాయని ఆశించామని, రాష్ట్రం వచ్చి పదేళ్లయినా తమ ఆకాంక్షలు నెరవేరలేదని వారు ఆవేదన వ్యక్తం చేయడం నన్ను కలిచివేసింది. కేసీఆర్ పదేళ్ల పాలనలో తెలంగాణ యువతకు న్యాయం జరగలేదు. నోటిఫికేషన్లు లేక, కోర్టు కేసులతో, పేపరు లీకులతో 30 లక్షల మంది నిరుద్యోగ యువత తీవ్రంగా నష్టపోయారు. వారు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలోనే వారికి కొలువులు రాని దుస్థితి.అందుకే వారి కలలు సాకారం అయ్యేలా.. కాంగ్రెస్ పార్టీ రూపొందించిన జాబ్ క్యాలెండరును వారికి చూపించి వారిలో భరోసా నింపే ప్రయత్నం చేశాను. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోపే, 2 లక్షల నియామకాలను పూర్తి చేసి యువతకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం.” పేర్కొన్నారు.