Tirumala : తిరుమల నడకదారిలో విషాదకర ఘటన జరిగింది. ఇంటెలిజెన్స్ డీఎస్పీ కృపాకర్ మృతి చెందారు. 1,805 మెట్టు వద్ద ఆయన గుండెపోటుకు గురయ్యారు. ఆస్పత్రి తరలించేలోపే డీఎస్పీ కృపాకర్ తుదిశ్వాస విడిచారు.
ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో భద్రతా విధుల కోసం డీఎస్పీ కృపాకర్ తిరుమలకు వచ్చారు. ఆయన వయస్సు 59 ఏళ్లు. స్వస్థలం విజయవాడ పోరంకి. కృపాకర్ మరణించిన విషయాన్ని ఆయన కుటుంబసభ్యులకు పోలీసులు సమాచారం ఇచ్చారు.