Bandi Sanjay Resign Letter : సీఎం కేసీఆర్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మండిపడ్డారు. దొంగ పాస్పోర్టులు తయారుచేసిన వ్యక్తికి ఫోర్జరీ లేఖలు సృష్టించడం పెద్ద కష్టం కాదని ఎద్దేవా చేశారు. తాను బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి రాజీనామా చేసినట్టు సామాజిక మాధ్యమాల్లో ఫోర్జరీ లేఖ వైరల్ కావడంపై బండి స్పందించారు.
జీహెచ్ఎంసీ, దుబ్బాక, హుజురాబాద్ ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ ఓడిపోతుందని తెలిసి ఇట్లాంటి ఫేక్ లెటర్లనే కేసీఆర్ సృష్టించారని గుర్తుచేశారు. అయినా కూడా ప్రజలు బీజేపీని గెలిపించారని బండి సంజయ్ ట్విట్టర్ వేదికగా తెలిపారు. తాజాగా సర్క్యులేట్ అవుతున్న లెటర్ కూడా కేసీఆర్ సృష్టించాడంటే మునుగోడులో టీఆర్ఎస్ ఓడిపోతుందని స్పష్టమవుతుందన్నారు.