Revanth Reddy : టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కొన్నిరోజులుగా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. రోజూ కనీసం మూడు నియోజకవర్గాల్లో బహిరంగ సభల్లో పాల్గొంటున్నారు. కార్నర్ మీటింగ్ లు, రోడ్ షోల ద్వారా ప్రచారం చేస్తున్నారు. ఇలా క్షణం తీరికలేకుండా ఆయన ఎన్నికల ప్రచారం సాగుతోంది.
రేవంత్ రెడ్డి హెలికాప్టర్ లో ప్రయాణించడం వల్లే వేగంగా ఒకచోట నుంచి మరోచోటుకు వెళుతున్నారు. కానీ ప్రతికూల వాతావరణం రేవంత్ ప్రచారం జోరుకు కాస్త బ్రేకులు వేసింది. దీంతో రేవంత్ హెలికాప్టర్ ప్రయాణం రద్దు చేసుకున్నారు. రోడ్డు మార్గాన నకిరేకల్ సభకు బయలుదేరి వెళ్లారు. ఆయన వెంట అద్దంకి దయాకర్ , అయోధ్య రెడ్డి ఉన్నారు.
శుక్రవారం రేవంత్ రెడ్డి నాలుగు సభల్లో పాల్గొనే ప్లానే చేశారు. నకిరేకల్, తుంగతుర్తి, ఆలేరు, కామారెడ్డిలో బహిరంగ సభల్లో ఆయన పాల్గొనాలి. హెలికాప్టర్ ప్రయాణాన్ని రుద్దు చేసుకోవడంతో కామారెడ్డి సభను శనివారానికి వాయిదా వేశారు.
.
.
.