నటుడు ప్రకాష్ రాజ్కు ఈడీ షాక్ తగిలింది. ఓ నగల షాపునకు సంబంధించి రూ.100 కోట్లు పోంజి స్కీమ్ కేసు విచారణను ఈడీ చేపట్టింది. ఈ కేసులో ప్రకాష్ రాజ్ ను ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు నోటీసులు జారీ చేశారు.
తమిళనాడులోని తిరుచునాపల్లికి చెందిన ప్రణవ్ జ్యుయెలర్స్కు ప్రకాశ్ రాజ్ ప్రచారకర్తగా పనిచేశారు. ఆ సంస్థ పొంజి స్కీమ్ ద్వారా అధిక లాభాల ఆశ చూపిందని ఆరోపణలు వచ్చాయి. ప్రజల నుంచి రూ.100 కోట్లు వసూలు చేసిందని అభియోగాలు నమోదయ్యాయి.
ఈ ఏడాది అక్టోబర్ లో ప్రణవ్ జ్యుయెలర్స్ బోర్డు తిప్పేసింది. సదరు సంస్థ యజమాని మదన్పై తమిళనాడులో కేసు నమోదైంది. రాష్ట్ర ఆర్థిక నేరాల విభాగం ఈ కేసు నమోదు చేసింది. నవంబర్ లో ఆయనపై లుక్అవుట్ నోటీసులు జారీ చేసింది. అలాగే చెన్నై, పుదుచ్చేరిలో ప్రణవ్ జ్యుయెలర్స్ బ్రాంచ్లు, యజమానుల ఇళ్లలో ఈడీ అధికారులు సోదాలు చేశారు. ఈ క్రమంలోనే రూ.100 కోట్ల మేర మోసం జరిగిందని గుర్తించారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ప్రకాష్ రాజ్ కు నోటీసులు జారీ అయ్యాయి.