EPAPER

AP High Court Notices To Jagan : రఘురామకృష్ణరాజు పిటిషన్‌పై విచారణ.. జగన్‌కు హైకోర్టు నోటీసులు..

AP High Court Notices To Jagan : రఘురామకృష్ణరాజు పిటిషన్‌పై విచారణ.. జగన్‌కు హైకోర్టు నోటీసులు..
ap political news

AP High Court Notices To Jagan(AP political news):

ఏపీ ప్రభుత్వం ఆర్థిక అవకతవకలకు పాల్పడిందంటూ.. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. సీఎం వైఎస్ జగన్‌ సహా కొంతమంది మంత్రులు, అధికారులకు నోటీసులు ఇచ్చింది. మొత్తం 41 మందికి నోటీసులు పంపింది. ఈ పిటిషన్ పై తదుపరి విచారణను డిసెంబర్ 14కి వాయిదా వేసింది.


ఏపీలో అమలు చేస్తున్న పథకాల మాటున ఆర్థిక అవకతవకలు జరుగుతున్నాయని రఘురామకృష్ణరాజు ఆరోపించారు. ఈ వ్యవహారంపై సీబీఐతో విచారణ జరిపించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. తాజాగా ఈ పిటిషన్ పై హైకోర్టు విచారణ చేపట్టింది. ఏపీ ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ శ్రీరామ్‌ వాదనలు వినిపించారు. ఈ పిటిషన్ లో ప్రజా ప్రయోజనాలేవి లేవని స్పష్టంచేశారు. కేవలం వ్యక్తిగత దురద్దేశాలతో పిటిషన్‌ వేశారని ఉన్నత న్యాయస్థానానికి వివరించారు. రఘురామకృష్ణరాజు వేసిన పిటిషన్‌కు విచారణ అర్హత లేదన్నారు.

మరోవైపు పిటిషనర్ రఘురామకృష్ణరాజు తరఫున న్యాయవాది తమ వాదన వినిపించారు. ఈ పిటిషన్ హైకోర్టులో వేయగానే.. ప్రభుత్వం కొన్ని రికార్డులను ధ్వంసం చేసిందని ఆరోపించారు. ఇరువైపుల వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం 41 మంది ప్రతివాదులకు నోటీసులు ఇచ్చింది.


Related News

Shani effect to Jagan: జగన్‌ను వెంటాడుతున్న శని, పుష్కర‌కాలంపాటు..

CM Chandrababu warning: తిరుపతి లడ్డూ వివాదం, నిన్ను వదలా అంటున్న సీఎం.. అయోధ్య వరకూ

Tirumala Laddu: ఛీ, ఇంత నీచమా? ఏపీ ప్రజల సెంటిమెంట్‌పై గట్టి దెబ్బ.. వైసీపీని ఈ పాపం వెంటాడుతుందా?

Adani Foundation: ఏపీ వరద బాధితులకు అదానీ ఫౌండేషన్ భారీ విరాళం.. ఎంతనో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Tirupati Laddu: తిరుమల లడ్డూ ప్రసాదంలో గొడ్డు మాంసం? ఇదిగో ప్రూఫ్.. ల్యాబ్ టెస్ట్‌లో బయటపడింది ఇదే

Balineni Comments: జగన్ ఏరోజూ సభల్లో నా గురించి మాట్లాడలేదు.. అందుకే పార్టీని వీడా: బాలినేని

Ambati Rambabu: నాణ్యమైన మద్యం అంటే ఏంటి..? ఎంత తాగినా ఆరోగ్యం దెబ్బతినదా..? : అంబటి ఎద్దేవా

Big Stories

×