Palnadu Crime : కుటుంబ కలహాలు పల్నాడులో ముగ్గురి హత్యకు దారి తీశాయి. పిడుగురాళ్ల మండలం కోనంకిలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గుర్ని విచక్షణారహితంగా కత్తులతో పొడిచి చంపారు. కుటుంబ కలహాల నేపథ్యంలో సమీప బంధువులే ఈ హత్యలు చేశారు. అనంతరం ముప్పాళ్ళ పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు. మృతులను సాంబశివరావు (50), భార్య ఆదిలక్ష్మి (47), కుమారుడు నరేష్ (30) గా పోలీసులు గుర్తించారు. మృతుడి కోడలు మాధురితో సహా పలువురు నిందితులు పోలీసులకు లొంగిపోయిన వారిలో ఉన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ముప్పాళ్ళ పోలీసులు తెలిపారు.