EPAPER

Stock Markets : నాలుగో రోజూ బుల్ రన్

Stock Markets : నాలుగో రోజూ బుల్ రన్

Stock Markets : భారత స్టాక్ మార్కెట్లు వరుసగా నాలుగో సెషన్ నూ లాభాల్లోనే ముగించాయి. వడ్డీ రేట్లను అమెరికా ఫెడరల్ రిజర్వ్ పెద్దగా పెంచదనే అంచనాలు… ఆసియా మార్కెట్లలో సానుకూలత… విదేశీ మదుపర్ల కొనుగోళ్లు… మార్కెట్లను ఆద్యంతం లాభాల్లోనే నడిపించాయి. ఉదయం 61 వేల పాయింట్ల పైన లాభాల్లో మొదలైన సెన్సెక్స్… ఇంట్రాడేలో 61,290-60,869 పాయింట్ల మధ్య చలించింది. ఓ దశలో 500 పాయింట్లకు పైగా ఎగిసిన సెన్సెక్స్‌ చివరికి 375 పాయింట్ల లాభంతో 61,121 పాయింట్ల దగ్గర ముగిసింది. నిఫ్టీ 133 పాయింట్లు పెరిగి… 18,145 పాయింట్ల దగ్గర క్లోజైంది.


సెన్సెక్స్‌ 30 సూచీలో 24 షేర్లు లాభపడగా… 6 నష్టపోయాయి. ఎన్‌టీపీసీ, పవర్‌గ్రిడ్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, ఇన్ఫోసిస్‌, టీసీఎస్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఏషియన్‌ పెయింట్స్‌, సన్‌ఫార్మా, విప్రో షేర్లు ఎక్కువగా లాభపడ్డాయి. ఇక నష్టపోయిన షేర్లలో యాక్సిస్‌ బ్యాంక్‌, మారుతీ, రిలయన్స్‌, టాటా స్టీల్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, భారతీ ఎయిర్‌టెల్‌ ఉన్నాయి.

మరోవైపు డాలర్ తో రూపాయి మారకం విలువ స్వల్పంగా లాభపడింది. సోమవారం 34 పైసలు నష్టపోయి 82 రూపాయలా 81 పైసల దగ్గర ముగిసిన రూపాయి… మంగళవారం 10 పైసలు లాభపడి… 82 రూపాయలా 71 పైసల దగ్గర ముగిసింది.


Tags

Related News

Nindha Movie: ఓటీటీలోనూ దూసుకుపోతున్న ‘నింద’.. ఒక్క రోజులోనే ఇన్ని వ్యూసా..?

Game Changer: ఎట్టేకలకు గేమ్ ఛేంజర్ అప్డేట్ వచ్చేసిందోచ్..

Inaya Sulthana: ఇసుకలో ఇనయా ఆటలు.. మరీ అంతలా అందాలు ఆరబెట్టాలా?

Donations To Flood Victims: ఏపీకి విరాళాల వెల్లువ.. ఎన్నడూ లేనంతగా.. వాళ్ల కోసమేనా!

Mississippi bus crash: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం..7 గురి దుర్మరణం..37 మందికి గాయాలు

Pranayagodari: ‘గు గు గ్గు’ పాటను రిలీజ్ చేసిన గణేష్ మాస్టర్

Rare Airbus Beluga: శంషాబాద్ ఎయిర్ పోర్టులో బాహుబలి ఎయిర్ క్రాఫ్ట్ ఎంత పెద్దదో చూశారా?

Big Stories

×