Telangana Elections : తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి కౌంట్డౌన్ కంటిన్యూ అవుతోంది. ఇప్పటికే పీక్స్కు చేరిన తెలంగాణ ఎన్నికల ప్రచారంలో నేడు ఆసక్తికర పరిణామం జరగనుంది. సీఎం కేసీఆర్ సొంత నియోజకవర్గమైన గజ్వేల్లో రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. అదే సమయంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గమైన కొడంగల్లో కేసీఆర్ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.
తెలంగాణ అసెంబ్లీ పోరులో ప్రత్యేకంగా వినిపిస్తున్ననియోజకవర్గాల్లో అతి ముఖ్యమైన నియోజకవర్గాలు గజ్వేల్, కొడంగల్. ఈ నియోజకవర్గాల పేరు వింటే చాలు.. రాష్ట్రవ్యాప్తంగా ఏ నోట విన్న చిన్నపాటి చర్చ మొదలవుతుంది. గజ్వేల్లో కేసీఆర్ను ఓడించాలని కాంగ్రెస్.. కొడంగల్లో రేవంత్ను మట్టికరిపించలని బీఆర్ఎస్.. ఇలా ఎవరి వ్యహాలు రచించడంలో వారు బిజీగా ఉన్నారు. పంతం నెగ్గించుకునేందుకు ఒకరు.. పదవిని దక్కించుకునేందుకు మరొకరి మధ్య ఆధిపత్య పోరుతో ఈ రెండు నియోజకవర్గాల్లో ప్రచారం పీక్స్కు చేరింది.
కొడంగల్లో కేసీఆర్ ఏం మాట్లాడుతారు? గజ్వేల్లో రేవంత్ ఎలా నిలదీస్తారు? అన్నది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది.
.
.