Telangana Elections : ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన షెడ్యూల్ ఫిక్స్ అయింది. ఈ నెల 25, 26, 27 తేదీల్లో ప్రచారంలో పాల్గొననున్నారు మోదీ. ఈనెల 25న మహేశ్వరం, కామారెడ్డి సభలకు హాజరుకానున్నారు. 26న తుఫ్రాన్, నిర్మల్ సభల్లో ప్రసంగించనున్నారు మోదీ. 27న మహబూబ్బాద్, కరీంనగర్ సభల్లో పాల్గొననున్నారు. అనంతరం అదేరోజు సాయంత్రం హైదరాబాద్లో నిర్వహించే రోడ్ షోకు హాజరవుతారు.
మరో వైపు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ ఇవాళ తెలంగాణలో ప్రచారం నిర్వహించనున్నారు. చార్మినార్, మలక్ పేట సెగ్మెంట్లలో ఆయన ప్రచారం నిర్వహించనున్నారు. ఆయనతో పాటు మరికొందరు జాతీయ నేతలు సైతం ప్రచారంలో పాల్గొననున్నారు. బీజేపీ యువమోర్చా జాతీయ అధ్యక్షుడు, బెంగళూరు సౌత్ ఎంపీ తేజస్వీ సూర్య సైతం ప్రచారంలో పాల్గొంటున్నారు. ఉత్తరప్రదేశ్కు చెందిన ఎంపీ రవి కిషన్.. పటాన్ చెరువు, కుత్బుల్లాపూర్, రాజేంద్ర నగర్లో ప్రచారం నిర్వహించనున్నారు. మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలు వనతి శ్రీనివాసన్ సైతం ప్రచారం నిర్వహించనున్నారు. ఇకపోతే కేంద్ర మంత్రి అర్జున్ ముండా.. నేడు వర్ధన్నపేట, స్టేషన్ ఘనపూర్.. రేపు వికారాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించనున్నారు.