Achampet Congress Meeting : తెలంగాణలో దొరల రాజ్యాన్ని బొంద పెడతామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి శపథం చేశారు. అచ్చంపేటలో నిర్వహించిన కాంగ్రెస్ విజయభేరి బహిరంగ సభలో కేసీఆర్ ప్రభుత్వం వైఫల్యాలను ఎండగట్టారు. కేసీఆర్ గడీలను నేలమట్టం చేస్తామని స్పష్టం చేశారు.పేదలంతా ఇందిరమ్మ రాజ్యం కావాలని కోరుకుంటున్నారని చెప్పారు. దొరల రాజ్యం ఉండాలని కేసీఆర్ మాత్రమే కోరుకుంటున్నారని తెలిపారు. దొరల రాజ్యంలో బార్ షాపులు పెరగాయన్నారు.
కేసీఆర్ ను ముఖ్యమంత్రిని చేయడానికి ఉద్యమకారులు ఆత్మబలిదానాలు చేసుకున్నారా? అని రేవంత్ ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారంటీలను ప్రజలకు వివరించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మహిళల కోసం ప్రవేశపెట్టే పథకాల గురించి చెప్పారు. ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తామన్నారు.
అచ్చంపేట బీఆర్ఎస్ అభ్యర్థి గువ్వల బాలరాజుపైనా రేవంత్ రెడ్డి విమర్శనాస్త్రాలు సంధించారు. బాలరాజు ప్రజలపైనా దౌర్జన్యాలు చేస్తున్నారని ఆరోపించారు. అందుకే ఆయనను ఓడించాలని ఓటర్లను కోరారు.
మార్పుకావాలంటే .. కాంగ్రెస్ రావాలి పిలుపునిచ్చారు. అచ్చంపేట కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణను 50 వేల మెజార్టీతో గెలిపించాలన్నారు.
.
.