EPAPER

Pushkar Mela 2023 : 8 ఏళ్లు.. 1570 కిలోల బరువు.. 150 దూడలకు జన్మనిచ్చిన దున్న..

Pushkar Mela 2023 : 8 ఏళ్లు.. 1570 కిలోల బరువు.. 150 దూడలకు జన్మనిచ్చిన దున్న..

Pushkar Mela 2023 : బాహుబలి సినిమాలో రానా ఒక దున్నతో పోరాడే సీన్ గుర్తుంది కదూ. చాలా భారీగా, బలిష్ఠంగా ఉండే ఆ దున్నను చూసి.. ఆ సినిమా వచ్చిన కొత్తలో దాని గురించే మాట్లాడుకున్నారు. రాజస్థాన్ లోని అజ్మీర్ లో జరుగుతున్న ఇంటర్నేషనల్ యానిమల్ మేళా (Pushkar Mela 2023)లో దానిని మించిన దున్న కనిపించింది. బాహుబలి దున్నకంటే ఇది చాలా పెద్దది. 5.8 అడుగుల పొడవు, 1570 కిలోల బరువు ఉన్న ఈ దున్న ఇప్పటి వరకూ 150 దూడలకు జన్మనిచ్చింది.


ఈ బర్రెను దాని యజమాని తాజాగా అంతర్జాతీయ పశు మేళాలో ఏకంగా రూ.11 కోట్లకు అమ్మకానికి పెట్టడంతో ఇది వార్తల్లో నిలిచింది. రాజస్థాన్ లోని అజ్మీర్ లో జరుగుతున్న ఇంటర్నేషనల్ యానిమల్ మేళాలో ఈ దున్న స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. దాని వయసు 8 ఏళ్లు. హర్యానాలోని సిర్సా ప్రాంతానికి చెందిన హర్విందర్ సింగ్.. ఈ బాహుబలి దున్నను తన సొంత బిడ్డలా పెంచాడు. దానికి అన్మోల్ అని పేరు కూడా పెట్టాడు. ప్రతిరోజూ పౌష్టికాహారం పెడతాడు. అరటిపండ్లు, గుడ్లు సహా బలమైన ఆహారాన్ని పెడతాడు. దీని పోషణకు నెలకు రూ.3 లక్షలు ఖర్చుచేస్తున్నట్లు హర్విందర్ తెలిపాడు.

ఈ దున్న వీర్యంతో ఇప్పటి వరకూ.. 40-50 కిలోల బరువున్న 150 దూడలు జన్మించాయని, అవన్నీ ఆరోగ్యంగా ఉన్నాయని హర్విందర్ వెల్లడించాడు. గతేడాది 1400 కిలోల బరువున్న ఈ దున్న.. ఈ ఏడాది 1570 కిలోలకు పెరిగింది. గతేడాది నిర్వహించిన మేళాలో ఓ వ్యక్తి రూ.3 కోట్లకు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపగా.. అమ్మేందుకు హర్విందర్ నిరాకరించాడు. ఈ సారి రూ.11 కోట్లకు అమ్మకానికి పెట్టగా.. అంత ఖర్చుచేసి కొనేవారికోసం ఎదురుచూస్తున్నాడు హర్విందర్. అన్మోల్ చాలా విలువైనదని, తక్కువ ధరకు మాత్రం అమ్మనని తెలిపాడు.


Related News

Nipah virus: కేరళలో నిఫా వైరస్ విజృంభణ.. స్టూడెంట్ మృతి.. రాష్ట్రంలో ఆంక్షలు!

PM Modi: ఇది ట్రైలర్ మాత్రమే.. ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు నాయుడు భేటీ

yashwant Sinha: వాజ్ పేయి సిద్ధాంతాలతో.. పార్టీ పేరు ప్రకటించిన యశ్వంత్ సిన్హా

Delhi: ఢిల్లీకి తదుపరి సీఎం ఎవరు? రేసులో ఆరుగురు పేర్లు.. వీళ్లేనా?

Rajasthan Road Accident: రాజస్థాన్‌లో ట్రక్కును ఢీకొట్టిన తుఫాను.. ఎనిమిది మంది దుర్మరణం

Jammu Kashmir: గాంధీ, నెల్సన్ మండేలాతో బీజేపీ పోల్చుతున్న ఈ బుఖారీ ఎవరు?

PM Narendra Modi: మరో 6 వందే భారత్ రైళ్లు.. వర్చువల్‌గా ప్రారంభించిన ప్రధాని మోదీ

Big Stories

×