Ind vs Aus : వరల్డ్ కప్ ఫైనల్లో 241 టార్గెట్ తో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా తొలి ఓవర్ నుంచే దూకుడుగా ఆడింది. బుమ్రా వేసిన తొలి ఓవర్ లో 15 పరుగులు వచ్చాయి. దీంతో కెప్టెన్ రోహిత్ రెండో ఓవర్ లోనే మహమ్మద్ షమీని బౌలింగ్ కు దించాడు. ఈ వ్యూహం ఫలించింది. డేవిడ్ వార్నర్ ( 7) స్లిప్ లో కోహ్లికి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. కానీ దూకుడుగా ఆడాలనే వ్యూహంతో బరిలోకి దిగిన ఆసీస్ తొలి రెండు ఓవర్లలో వికెట్ నష్టానికి 28 పరుగులు చేసింది.
ఈ మ్యాచ్ లో తొలి వికెట్ తీసిన షమీ.. టోర్ని టాపర్ గా నిలిచాడు. ఇది షమీకి 24వ వికెట్. ఆ తర్వాత ఆస్ట్రేలియా స్పిన్నర్ జంపా 23 వికెట్లతో రెండోస్థానం ఉన్నాడు. ఫైనల్ లో జంపాకు ఒక వికెట్ మాత్రమే దక్కింది.
మిచెల్ మార్ష్ (15 బంతుల్లో 15, ఫోర్, సిక్సు) ను అవుట్ చేసి బుమ్రా భారత్ బ్రేక్ త్రూ ఇచ్చాడు. దీంతో ఆసీస్ 41 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత వెంటనే బూమ్రా మరో వికెట్ తీసి భారత్ ను రేసులోకి తెచ్చాడు. స్టార్ బ్యాటర్ స్టివ్ స్మిత్ (4, 9 బంతుల్లో ఫోర్) అవుట్ కావడంతో ఆసీస్ 47 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది. దీంతో భారత్ మ్యాచ్ పై పట్టు బిగించింది.