Revanth Reddy : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ఉద్దేశించి మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్పై రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత ఎంపీగా నిజామాబాద్ లో ఓడిపోయిన విషయాన్ని గుర్తు చేశారు. కేసీఆర్ రాజకీయ జీవితం కూడా ఓటమితోనే మొదలైందన్న సంగతి గుర్తుందా..!? అంటూ కేటీఆర్ ను ప్రశ్నించారు. ఆయనకు ఎవరన్నా గుర్తు చేయండి రా బాబూ..!? అంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ కు డ్రామా రావు అనే హ్యాష్ ట్యాగ్ ను జత చేశారు రేవంత్ రెడ్డి.
తెలంగాణలో భారత్ జోడో యాత్ర చేస్తున్న రాహుల్ గాంధీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. కేసీఆర్ ప్రకటించిన జాతీయపార్టీ బీఆర్ఎస్ పైనా సెటైర్లు వేశారు. కేసీఆర్ జాతీయ పార్టీ లక్ష్యాలపై రాహుల్ స్పందించిన తీరు హాస్యాస్పదంగా ఉందని కేటీఆర్ విమర్శించారు. అంతర్జాతీయ నేత రాహుల్ గాంధీ కనీసం తన సొంత నియోజకవర్గం అమేథీలో గెలవలేకపోయారని కేటీఆర్ ట్వీట్ చేశారు. అలాంటి వ్యక్తి బీఆర్ఎస్పై మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. ప్రధాని కావాలనుకునే వారు ముందు ఎంపీ అయ్యేలా ప్రజల్లో నమ్మకం కల్గించుకోవాలని కేటీఆర్ విమర్శించారు. దీనికి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ ఇచ్చారు.