EPAPER

Nirudyoga Chaithanya Yatra : నిరుద్యోగ చైతన్య బస్సు యాత్రకు లైన్ క్లియర్.. ఈసీ గ్రీన్ సిగ్నల్..

Nirudyoga Chaithanya Yatra : నిరుద్యోగ చైతన్య బస్సు యాత్రకు లైన్ క్లియర్.. ఈసీ గ్రీన్ సిగ్నల్..

Nirudyoga Chaithanya Yatra : నిరుద్యోగ చైతన్య బస్సు యాత్రకు రంగం సిద్ధమైంది. ఈ యాత్రకు ఎన్నికల కమిషన్ అనుమతి ఇచ్చింది. బుధవారం సాయంత్రం 4గంటలకు గన్‌పార్క్ నుంచి నిరుద్యోగుల బస్సు యాత్ర ప్రారంభంకానుంది. నిరుద్యోగులంతా భారీ సంఖ్యలో తరలిరావాలని యువత కోరుతున్నారు.


నిరుద్యోగ చైతన్య బస్సు యాత్రను ప్రొఫెసర్లు హరగోపాల్, కోదండ రామ్, రియాజ్, రిటైర్డ్ IAS ఆకునూరి మురళి జెండా ఊపి ప్రారంభించనున్నారు. ఈనెల 25 వరకు తెలంగాణ వ్యాప్తంగా నిరుద్యోగ యాత్ర సాగనుంది. ఇలా 100 నియోజకవర్గాల్లో 10 రోజులపాటు యాత్ర సాగనుంది. .

నిరుద్యోగ చైతన్య యాత్ర కోసం 2 బస్సుల ఏర్పాటు చేశారు. ఒక్కో బస్సు 50 నియోజకవర్గాలు తిరగనుంది. ఒక బస్సు ఉత్తర తెలంగాణ, రెండోది దక్షిణ తెలంగాణకు వెళుతుంది. రోజుకు ఒక్కో బస్సు 5 నియోజకవర్గాలు తిరుగుతుంది. 10 రోజులు 100 నియోజకవర్గాల్లో తిరిగేలా కార్యాచరణ రూపొందించారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఈ యాత్రలో పాల్గొననున్నారు.


Tags

Related News

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Telangana in Debt Trap | తెలంగాణ ఆర్థిక పరిస్థితి దయనీయం.. రుణ వడ్డీల చెల్లింపులకే భారీగా ఖర్చు

ABP C Voter Survey Telangana | బీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా లోక్‌సభ ఎన్నికల సర్వే..

BRS Dark Secrets | బిఆర్ఎస్ పాలనలోని జీవో ఫైళ్లు మాయం.. రహస్య జీవోలతో కేసీఆర్ దాచినదేమిటి?

BJP : బీజేఎల్పీ నేత ఎవరు? రాజాసింగ్ కే ఇస్తారా?

Telangana Assembly Speaker : స్పీకర్‌ పదవికి గడ్డం ప్రసాద్‌ నామినేషన్‌.. బీఆర్ఎస్ మద్దతు..

Big Stories

×