Kerala court : అయిదేళ్ల చిన్నిరిపై అత్యాచారం చేసిన దోషికి కేరళ కోర్టు చిల్డ్రన్స్ డే రోజున మరణ శిక్ష విధించింది.
Kerala court : అయిదేళ్ల చిన్నిరిపై అత్యాచారం చేసిన దోషికి కేరళ కోర్టు చిల్డ్రన్స్ డే రోజున మరణ శిక్ష విధించింది.
కేరళలోని అలువ ప్రాంతంలో కొందరు కూలీలు ఉపాధి కోసం బీహార్ నుంచి వలస వచ్చి నివాసముంటున్నారు. వారిలో ఒకరికి అయిదేళ్ల కూతరు ఉంది. ఆ పాప రెండు రోజులుగా కనబడకపోవడంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
విచారణ మొదలుపెట్టిన పోలీసులు.. సీసీటీవి ఆధారంగా అష్వాక్ ఆలమ్ అనే వ్యక్తిని అనుమానించి అరెస్టు చేశారు. అతను కూడా బీహార్ నుంచి వలస వచ్చిన కూలీనే. పోలీసులు అతడిని గట్టిగా ప్రశ్నించగా.. పాప ఆచూకీ తెలిసింది. కొద్ది దూరంలో ఒక స్థానిక మార్కెట్ వద్ద ఉన్న డంపింగ్ యార్డులో చెత్త, బుడదలో పాప మృతదేహం లభించింది.
మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పంపించారు. పోస్టుమార్టం నివేదిక ప్రకారం.. పాపను అత్యాచారం చేసి.. ఆ తరువాత గొంతు నులిమి హత్య చేశారు. దీంతో పోలీసులు అష్వాక్ ఆలమ్పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసింది. ఈ కేసులో కేరళ పోక్సో కోర్టు విచారణ జరిపి.. వంద రోజుల తరువాత అంటే చిల్డ్రన్స్ డే రోజున దోషికి మరణశిక్ష విధించింది. అత్యాచారం చేయడమే కాకుండా.. హత్య కూడా చేయడంతో దోషి మరణ శిక్షకు అర్హుడని సంచలన తీర్పు చెప్పింది.