Moulana Rahimullah Tariq : పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ జైషే మొహమ్మద్కు చెందిన మత గురువు మౌలానా రహీముల్లా తారిఖ్ సోమవారం హత్యకు గురయ్యాడు. జైషే మొహమ్మద్ అధ్యక్షుడు మసూద్ అజ్హర్కు రహీముల్లా తారిఖ్ సన్నిహితుడు.
Moulana Rahimullah Tariq : పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ జైషే మొహమ్మద్కు చెందిన మత గురువు మౌలానా రహీముల్లా తారిఖ్ సోమవారం హత్యకు గురయ్యాడు. జైషే మొహమ్మద్ అధ్యక్షుడు మసూద్ అజ్హర్కు రహీముల్లా తారిఖ్ సన్నిహితుడు.
సోమవారం, నవంబర్ 13న, మౌలానా రహీముల్లా తారిఖ్ ఒక మతపరమైన కార్యక్రమంలో పాల్గొనడానికి కరాచీ నగరంలోని ఓరంగీ టౌన్కు వెళుతున్నప్పుడు మార్గమధ్యంలో ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు బైక్ మీద వచ్చి ఒక్కసారిగా కాల్పులు జరిపారు. దీంతో రహీముల్లా తారిఖ్ అక్కడే మరణించాడు.
కొద్ది రోజుల క్రితమే పాకిస్థాన్ కు చెందిన ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా సీనియర్ కమాండర్ అక్రమ్ ఖాన్ ఘాజీని కాల్చి చంపారు. ఈ ఘటన జరిగిన వారం రోజులకే రహీముల్లా తారిఖ్ హత్య జరగడంతో ఈ వరుస హత్యలు ఒకే సంస్థ చేయిస్తోందని అనుమానాలు కలుగుతున్నాయి.
భారతదేశంలో ఉగ్రవాద సంస్థ జైషే మొహమ్మద్ ఇంతకుముందు రెండుసార్లు పెద్ద దాడులు చేసింది. 2001లో పార్లమెంటుపై దాడి, ఆ తరువాత 2019లో పుల్వామా అటాక్ ఘటనలలో జైషే మొహమ్మద్ ఉగ్రవాదులే కారణం.
13 డిసెంబర్, 2001 సంవత్సరంలో పార్లమెంట్ శీతకాల సమావేశాలు జరుగుతున్నప్పుడు అయిదుగురు ఉగ్రవాదులు దాడి చేశారు. అందులో ఒకడు పార్లమెంటు గేటు వద్ద ఆత్మాహుతి దాడి చేసుకున్నాడు. ఆ తరువాత నలుగురు ఉగ్రవాదులను సెక్యూరిటీ బలగాలు కాల్చి చంపాయి. ఈ ఉగ్రవాద దాడికి జైషే మొహమ్మద్, లష్కరే తయ్యబా సంయుక్తంగా చేశాయి.
ఆ తరువాత 2019 సంవత్సరం, ఫిబ్రవరి 14న పుల్వామా దాడి జరిగింది. ఈ దాడిలో 40 మంది భారత సైనికులు చనిపోయిన విషయం తెలిసిందే.