EPAPER

Chandra Mohan : 100 కోట్లు ఆస్తి పోగొట్టుకున్న చంద్రమోహన్.. అసలు సంగతి ఇదే..

Chandra Mohan : 100 కోట్లు ఆస్తి పోగొట్టుకున్న చంద్రమోహన్.. అసలు సంగతి ఇదే..
Chandra Mohan

Chandra Mohan : టాలీవుడ్ సీనియర్ నటుడు.. హీరో చంద్రమోహన్ ఈరోజు అనారోగ్య కారణంగా హైదరాబాద్ అపోలో హాస్పిటల్ లో ఉదయం 9:45 నిమిషాలకు కన్నుమూశారు. చంద్రమోహన్ తన 50 సంవత్సరాల సినీ జీవితంలో ఎన్నో చిత్రాలలో నటించి మెప్పించారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో కొన్ని సంవత్సరాలపాటు లక్కీ హీరోగా పేరుపొంది మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు చంద్రమోహన్. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆయన ఆస్తులకు సంబంధించిన ఒక వార్త బాగా వైరల్ అవుతుంది.


విలక్షణమైన పాత్రను పోషించడంలో దిట్టగా పేరుపొందిన చంద్రమోహన్ కేవలం నటుడిగానే కాక విలన్ గా, కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో గొప్ప పాత్రలు పోషించారు. నటించడమే కాక తన కెరీర్ లో చంద్రమోహన్ బాగా సంపాదించాడు కూడా. మురళీమోహన్ ,శోభన్ బాబు లాగానే చంద్రమోహన్ కూడా తాను సంపాదించిన డబ్బును ఎక్కువగా భూమిపై పెట్టుబడి పెట్టాడు. మొత్తానికి చంద్రమోహన్ ఆస్తి విలువ సుమారు 300 కోట్లకు పైగా ఉంటుంది అని టాక్. ఈ నేపథ్యంలో ఆయన డబ్బులు నష్టపోయారు అంటూ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న వార్తలో ఎంత నిజం ఉందో తెలుసుకుందాం..

శోభన్ బాబుకు చంద్రమోహన్ దగ్గర డబ్బులు తీసుకుంటే కలిసి వస్తుంది అన్న నమ్మకం ఉండేదట. అందుకే ఆయన దగ్గర అదే పనిగా అడిగిమరీ డబ్బు తీసుకునే వారట. ఇప్పటికీ జనవరి ఫస్ట్ న చాలా మంది తమ ఇంటికి వచ్చి చంద్రమోహన్ చేతుల మీదుగా డబ్బు తీసుకుంటారు అని ఆయన భార్య ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. అదే సమయంలో చంద్రమోహన్ శోభన్ బాబు విషయంలో కాస్త భావోద్వేగానికి గురి అయ్యి కొన్ని సంగతులు షేర్ చేసుకున్నారు. ఈ సందర్భంగా శోభన్ బాబు చెప్పిన ఫైనాన్షియల్ అడ్వైస్ వినకుండా కొన్ని డెసిషన్స్ తీసుకుని నష్టపోయాను అని వాపోయారు.


ఇంతకీ విషయం ఏమిటంటే అప్పట్లో కొంపల్లి దగ్గర గొల్లపూడి మారుతీ రావు ఒక ద్రాక్ష తోటను తీసుకోవడం జరిగిందట. మారుతీ రావు సలహా మీద చంద్రమోహన్ కూడా అక్కడే 35 ఎకరాలు కొన్నారు. కానీ దాన్ని మేనేజ్ చేయలేక చివరికి అమ్మేశారు. అలాగే మద్రాసులో 15 ఎకరాలు అమ్మ పోయినప్పుడు శోభన్ బాబు వద్దు అన్నారట.. అయినా చంద్రమోహన్ ఆ భూమిని అమ్మడం జరిగింది. ఇప్పుడు ఆ భూమి ఖరీదు 30 కోట్లకు పైగానే ఉంది. ఇక ఇది కాక హైదరాబాద్ లోని శంషాబాద్ మెయిన్ రోడ్డు దగ్గర ఆరు ఎకరాలు కొని అమ్మేశారట చంద్రమోహన్. 

అలా అప్పుడు తాను వద్దు అనుకుని చాలా తక్కువ ధరకు అమ్మేసిన ఆస్తులు ఇప్పుడు దాదాపు 100 కోట్లకు పైగా విలువ చేస్తాయని.. అను జీవితంలో సంపాదించిన దాని కంటే ఎక్కువ పోగొట్టుకున్నాను అని చంద్రమోహన్ భావోద్వేగానికి గురయ్యారు. ఎక్కువ ప్రాఫిట్ రావాల్సిన వాటిని తక్కువ ధరకు అమ్ముకున్నాను అనే ఆయన ఉద్దేశం తప్ప అసలు ఏమీ లేకుండా రోడ్డు మీద నిల్చున్నాను అని ఎప్పుడూ చెప్పలేదు. అయితే ప్రస్తుతం ఆయన చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో చాలామంది ఆయన ఆస్తి నష్టపోయారు అని భావిస్తున్నారు. కానీ అసలు విషయం ఇది.

Related News

Ritika Singh: వెంకటేష్ హీరోయిన్ కూడా ఈ రేంజ్ గా చూపిస్తే.. కుర్రాళ్లు తట్టుకోవడం కష్టమే

Devara: కటౌట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలంటే ఇదేనేమో.. ఇదెక్కడి అరాచకంరా బాబు

Mirnalini Ravi: ఎట్టకేలకు ఒక ఇంటిదైన హాట్ బ్యూటీ.. తల్లిదండ్రులతో కలిసి..

Akkineni Family: అక్కినేని ఫ్యామిలీ ఫోటోలో ఆ స్టార్ హీరోయిన్ కూతురు.. ఎందుకు ఉన్నట్టు.. ?

Niharika Konidela: ఇంట గెలవలేక రచ్చ గెలవడానికి రెడీ అయిన మెగా డాటర్

Jani Master Case : కాపాడిన కల్తీ లడ్డూ… కొరియోగ్రాఫర్ జానీ సేఫ్..

ANR Award: మెగాస్టార్ కి అవార్డ్.. ఆ రోజే ప్రధానోత్సవం అంటూ ప్రకటించిన నాగ్..!

Big Stories

×