Tamil Nadu Bus Accident : తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరువత్తూర్ జిల్లా వానియంబడి.. చెన్నై- బెంగళూరు జాతీయ రహదారిలో ఈరోజు తెల్లవారుజామున ప్రైవేట్ బస్సు- ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో ఐదుగురు మృతిచెందగా.. మరో 40 మందికి గాయాలయ్యాయి. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. మృతదేహాల పోస్టుమార్టానికి ఏర్పాట్లు చేస్తున్నారు. మృతుల్లో నలుగురు పురుషులు, ఒక మహిళ ఉన్నారు.
ఈ ప్రమాదంలో కనీసం ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మృతుల్లో ఉలుందూరుపేటకు చెందిన ప్రభుత్వ బస్సు డ్రైవర్ ఎలుమలై ఉన్నారు. మృతుల్లో కోలార్కు చెందిన ప్రైవేట్ బస్సు డ్రైవర్ మహ్మద్ నదీమ్, వాణియంబడికి చెందిన ప్రైవేట్ బస్ క్లీనర్ మహ్మద్ బైరోస్ , చిత్తూరు చెందిన అజిత్ కుమార్ , చెన్నైకి చెందిన కృతిక అనే మహిళ ఉన్నారు.
అతి వేగమే ఈ ప్రమాదానికి కారణమని బస్సులోని ప్రయాణికులు వెల్లడించారు. పోలీసులు ఘటనపై కేసు నమెదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
.
.
.