Congress : కామారెడ్డిలో కాంగ్రెస్ బహిరంగ సభ నిర్వహించింది. ఈ సభలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. సభా వేదికపై కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్ ప్రకటించింది. బీసీల అభివృద్ధికి ఏం చేస్తామని ఈ డిక్లరేషన్ లో స్పష్టం చేసింది.
బీసీ డిక్లరేషన్..
అత్యంత వెనుకబడిన తరగుతుల కోసం ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు
బీసీల అభివృద్ధికి రూ. లక్ష కోట్ల ఫండ్
ఏటా బీసీలకు రూ. 20 వేల కోట్లు
బీసీ సంఘాలకు ప్రత్యేక గ్రాంట్లు
బీసీలకు రూ. 10 లక్షల లోన్
గౌడలకు వైన్ షాపుల్లో 25 శాతం రిజర్వేషన్లు
బీసీ (డీ) గ్రూపులో ఉన్న ముదిరాజ్ లు బీ (ఏ)లోకి మార్పు
తెలంగాణలోని ప్రతి మండలానికి ఒక బీసీ గురుకులం ఏర్పాటు
యాదవ, కురుమలకు గొర్రెల పంపిణీ
జనగామ జిల్లా పేరు సర్వాయి పాపన్న జిల్లాగా మార్పు
ప్రతి జిల్లాలో బీసీ భవనాల కోసం రూ. 50 కోట్లు
కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్ ప్రకటన
జనాభా ప్రాతిపదికన బీసీ రిజర్వేషన్ల పెంపు
అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో రిజర్వేషన్లు పెంపు
స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్
రిజర్వేషన్ల పెంపుతో కొత్తగా 23,973 మందికి పదవులు
తొలి అసెంబ్లీ సమావేశాల్లోనే బీసీలకు సబ్ప్లాన్ కు ఆమోదం
అన్ని కులాల వారికి కార్పొరేషన్ల ఏర్పాటు
.
.