Swap Party : చెన్నై ఈసీఆర్ రోడ్డులోని ఓ ఫాంహౌస్లో నిర్వహించిన స్వాప్ పార్టీలో పాల్గొన్న 8 మంది మహిళలు, 15 మంది పురుషులను పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చెన్నై ఈస్ట్ కోస్ట్ రోడ్డుపై పనైయూర్ వద్ద ఉన్న ఓ ఫాంహౌస్ను ఈ నెల 4,5 తేదీల్లో పార్టీ కోసం కొందరు బుక్ చేసుకున్నారు. శనివారం అక్కడికి కొందరు మహిళలు, పురుషులు చేరుకున్నారు. అనంతరం భారీ శబ్దంతో పాటలు పెట్టుకుని గంజాయి, మద్యం తాగిన మత్తులో మహిళలను మార్చుకుని ఉల్లాసంగా గడిపారు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఫాంహౌస్ కు చేరుకుని తనిఖీలు నిర్వహించారు. 8 మంది మహిళలు, 15 మంది పురుషులను అరెస్ట్ చేశారు. వారిని విచారించగా కోవై జిల్లా మేట్టుపాళ్యానికి చెందిన సెంథిల్కుమార్, అతడి భార్య నిర్వాహకులని తేలింది. 2018 నుంచి ఆర్థికంగా చితికిపోయి, కుటుంబ సమస్యలతో బాధపడుతున్న మహిళలను సోషల్ మీడియా ద్వారా టార్గెట్ చేసి స్వాప్ పార్టీలు నిర్వహిస్తున్నట్లు తెలిసింది. పోలీసులు వారిపై కేసు నమోదు చేసి, విచారణ చేస్తున్నారు.