EPAPER

Revanth Reddy : గద్వాలలో కాంగ్రెస్ జెండా ఎగరాలి.. ప్రజలకు రేవంత్ పిలుపు..

Revanth Reddy : గద్వాలలో కాంగ్రెస్ జెండా ఎగరాలి..  ప్రజలకు రేవంత్ పిలుపు..

Revanth Reddy : గద్వాల నియోజకవర్గంలోని నడిగడ్డలో కాంగ్రెస్ విజయభేరి సభ నిర్వహించింది. ఈ సభలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. గద్వాల గడ్డమీద కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమన్నారు. తెలంగాణ రైతులకు కాంగ్రెస్ ఎంతో మేలు చేసిందని తెలిపారు. భీమ, నెట్టెంపాడు, కోయల్ సాగర్ ప్రాజెక్టులు కాంగ్రెస్ హయాంలోనే నిర్మించారని వివరించారు.


సీఎం కేసీఆర్ పై రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. పాలమూరు ప్రాంతాన్ని కేసీఆర్ నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు. ధరణికి రైతుబంధుకు లింకేంటి అని ప్రశ్నించారు. 2020 నుంచే ధరణి ఉంది కదా అని నిలదీశారు.

రైతులకు ఉచితంగా కరెంట్ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ అని రేవంత్ రెడ్డి అన్నారు. రైతులను ఆదుకునేందుకు కాంగ్రెస్ డిక్లరేషన్ ప్రకటించిందన్నారు. గద్వాలలో కాంగ్రెస్ ను గెలిపించాలని ఓటర్లు పిలుపునిచ్చారు. గద్వాల నియోజకవర్గంలో నిర్వహించిన ఈ సభకు జనం భారీగా తరలివచ్చారు. ఉత్సాహంగా సభలో పాల్గొన్నారు. దీంతో సభా ప్రాంగణం కోలాహలంగా మారింది.


Related News

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Telangana in Debt Trap | తెలంగాణ ఆర్థిక పరిస్థితి దయనీయం.. రుణ వడ్డీల చెల్లింపులకే భారీగా ఖర్చు

ABP C Voter Survey Telangana | బీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా లోక్‌సభ ఎన్నికల సర్వే..

BRS Dark Secrets | బిఆర్ఎస్ పాలనలోని జీవో ఫైళ్లు మాయం.. రహస్య జీవోలతో కేసీఆర్ దాచినదేమిటి?

BJP : బీజేఎల్పీ నేత ఎవరు? రాజాసింగ్ కే ఇస్తారా?

Telangana Assembly Speaker : స్పీకర్‌ పదవికి గడ్డం ప్రసాద్‌ నామినేషన్‌.. బీఆర్ఎస్ మద్దతు..

Big Stories

×