Revanth Reddy : గద్వాల నియోజకవర్గంలోని నడిగడ్డలో కాంగ్రెస్ విజయభేరి సభ నిర్వహించింది. ఈ సభలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. గద్వాల గడ్డమీద కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమన్నారు. తెలంగాణ రైతులకు కాంగ్రెస్ ఎంతో మేలు చేసిందని తెలిపారు. భీమ, నెట్టెంపాడు, కోయల్ సాగర్ ప్రాజెక్టులు కాంగ్రెస్ హయాంలోనే నిర్మించారని వివరించారు.
సీఎం కేసీఆర్ పై రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. పాలమూరు ప్రాంతాన్ని కేసీఆర్ నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు. ధరణికి రైతుబంధుకు లింకేంటి అని ప్రశ్నించారు. 2020 నుంచే ధరణి ఉంది కదా అని నిలదీశారు.
రైతులకు ఉచితంగా కరెంట్ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ అని రేవంత్ రెడ్డి అన్నారు. రైతులను ఆదుకునేందుకు కాంగ్రెస్ డిక్లరేషన్ ప్రకటించిందన్నారు. గద్వాలలో కాంగ్రెస్ ను గెలిపించాలని ఓటర్లు పిలుపునిచ్చారు. గద్వాల నియోజకవర్గంలో నిర్వహించిన ఈ సభకు జనం భారీగా తరలివచ్చారు. ఉత్సాహంగా సభలో పాల్గొన్నారు. దీంతో సభా ప్రాంగణం కోలాహలంగా మారింది.