Vijayashanti : బీజేపీకి విజయశాంతి కూడా షాక్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారా? ఆమె పార్టీకి గుడ్ బై చెప్పనున్నారా? అంటే అవుననే అంటున్నారు. ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరతారని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వెల్లడించారు. KCRను ఓడించడానికే తాను, వివేక్ బీజేపీని వీడి కాంగ్రెస్ లో చేరామన్నారు. విజయశాంతి కూాడా కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని రాజగోపాల్రెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్ 70-80 స్థానాల్లో గెలుస్తుందని ధీమాగా చెప్పారు.
రాజగోపాల్రెడ్డి వ్యాఖ్యలు నిజమే అన్నట్టుగా ఉందని తాజా పరిణామాలు తెలియజేస్తున్నాయి. కొన్నాళ్లుగా విజయశాంతి బీజేపీ కార్యక్రమాల్లో అంత యాక్టివ్ గా పాల్గొనడంలేదు. తాను ఏడేళ్లు కాంగ్రెస్ జెండా మోశానని, కొందరు కాంగ్రెస్లో చేరాలని కోరుతుంటే… మరికొందరు బీజేపీలోనే ఉండాలని చెబుతున్నారని ఇటీవలే రాములమ్మ ట్వీట్ చేశారు.
తాజాగా పార్టీ ప్రచాకకర్తలుగా 40 మందిని నియమించిన బీజేపీ అధిష్టానం. అయితే అందులో తొలుత విజయశాంతికి చోటు కల్పించలేదు. దాంతో ఆమె బీజేపీని వీడతారని వార్తలు వచ్చాయి. కానీ ఆ తర్వాత ప్రచారకర్తలుగా విజయశాంతితో పాటు రఘునందన్రావును బీజేపీ అధిష్టానం నియమించింది. అయితే దీనిపై కూడా రాములమ్మ అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం.
మొత్తంమీద విజయశాంతి బీజేపీని వీడేందుకు సిద్ధమయ్యారనే చర్చ సర్వత్రా నడుస్తోంది. ఆమె కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వివేక్ బాటలోనే నడుస్తారని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే రాములమ్మ నిర్ణయంపై అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.