EPAPER

BOGUS VOTES : దొంగ ఓట్ల కలకలం.. ఈసీకి తుమ్మల ఫిర్యాదు..

BOGUS VOTES : దొంగ ఓట్ల కలకలం.. ఈసీకి తుమ్మల ఫిర్యాదు..
Tummala comments on bogus votes

Tummala comments on bogus votes(Election news in telangana) :

ఖమ్మం జిల్లాలో 30వేలకు పైగా దొంగ ఓట్లున్నాయని కేంద్ర ఎన్నికల సంఘానికి ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వర రావు ఫిర్యాదు చేశారు. తుమ్మల తరఫున లాయర్ల ప్రతినిధి బృందం ఢిల్లీలో ఈసీ అధికారులను కలిసి కంప్లైంట్ చేసింది.


జిల్లాలో ఇంటి నెంబర్లు లేకుండానే ఓట్ల నమోదు విషయాన్ని ఈసీ దృష్టికి తీసుకెళ్లింది. ఖమ్మం జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో 30వేలకు పైగా ఓట్లు ఇంటి నెంబర్లు లేకుండానే ఉన్నాయని వివరించింది. దీనిపై కలెక్టర్, సీఈవో, ఇతర ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని తుమ్మల చెబుతున్నారు. గతంలో చేసిన తొమ్మిది ఫిర్యాదుల వివరాలను కూడా చూపించారు.

ఓట్ల జాబితా తుది ప్రకటన వెలువడనున్న నేపథ్యంలో దొంగ ఓట్లపై దృష్టి సారించాలని ఈసీకి విజ్ఞప్తి చేశారు. ఇంటి నెంబర్లు లేకుండా నమోదు చేసిన ఓట్లను వెంటనే తొలగించాలని, బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. దొంగ ఓట్లు తొలగించిన తర్వాతే తుది జాబితా విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు.


.

.

Related News

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Telangana in Debt Trap | తెలంగాణ ఆర్థిక పరిస్థితి దయనీయం.. రుణ వడ్డీల చెల్లింపులకే భారీగా ఖర్చు

ABP C Voter Survey Telangana | బీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా లోక్‌సభ ఎన్నికల సర్వే..

BRS Dark Secrets | బిఆర్ఎస్ పాలనలోని జీవో ఫైళ్లు మాయం.. రహస్య జీవోలతో కేసీఆర్ దాచినదేమిటి?

BJP : బీజేఎల్పీ నేత ఎవరు? రాజాసింగ్ కే ఇస్తారా?

Telangana Assembly Speaker : స్పీకర్‌ పదవికి గడ్డం ప్రసాద్‌ నామినేషన్‌.. బీఆర్ఎస్ మద్దతు..

Big Stories

×