Hyderabad : హైదరాబాద్ నగరంలో సోమవారం గ్యాస్ పైప్లైన్ లీక్ ఘటన కలకలం రేపింది. కొంపల్లి, సుచిత్ర ప్రధాన రోడ్డుపై గ్యాస్ పైప్ లీకైంది. గ్యాస్ పైప్ లీక్ కావటంతో ఆ ప్రాంతంలో మంటలు భారీగా ఎగిసిపడ్డాయి.
హైదరాబాద్ నగరంలో సోమవారం గ్యాస్ పైప్లైన్ లీక్ ఘటన కలకలం రేపింది. కొంపల్లి, సుచిత్ర ప్రధాన రోడ్డుపై గ్యాస్ పైప్ లీకైంది. గ్యాస్ పైప్ లీక్ కావటంతో ఆ ప్రాంతంలో మంటలు భారీగా ఎగిసిపడ్డాయి.
ప్రధాన రోడ్డు పక్కనే పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడటంతో వాహనదారులు భయాందోళనలకు గురయ్యారు. మంటల్ని చూసి స్థానికులు అక్కడి నుంచి పరుగులు తీశారు.
భాగ్యలక్ష్మి గ్యాస్ సరఫరా పైపు లీక్ అయినట్లు తెలుస్తోంది. రహదారి పక్కనే అభివృద్ధి పనులు చేస్తుండగా.. ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు అటువైపు వాహనాలు వెళ్లకుండా కట్టడి చేశారు. అనంతరం భాగ్యలక్ష్మి గ్యాస్ అధికారులకు సమాచారమిచ్చారు.
సంఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. పైప్ లైన్కు మరమ్మత్తులు చేసేందుకు మెయిన్ లైన్ గ్యాస్ను ఆపేశారు. ఈ గ్యాస్ లీకేజీ ఘటనలో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారని.. వారిని సమీప ఆస్పత్రికి తరలించామని పోలీసులు తెలిపారు.