Nagarkurnool Assembly Constituency : తెలంగాణ ఎన్నికలపై బిగ్ టీవీ చేపట్టిన సర్వేలో ఫలితాలపై ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. నాగర్ కర్నూల్ జిల్లా నాగర్ కర్నూల్ నియోజకవర్గంపై తాజాగా చేపట్టిన సర్వేలో ఓటర్ల తీర్పు ఎటువైపు ఉందో చూస్తే..
నియోజకవర్గం : నాగర్కర్నూలు
జిల్లా : నాగర్కర్నూలు జిల్లా
మొత్తం ఓటర్లు: 2,24,864
పురుషులు: 1,12,657
మహిళలు : 1,11,971
ప్రస్తుత ఎమ్మెల్యే : మర్రి జనార్దన్ రెడ్డి (BRS)
బిగ్ టీవీ సర్వే.. పందెం కోళ్లు-2 (05-11-2023)
తాజాగా బిగ్ టీవీ చేసిన బిగ్ టీవీ సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మర్రి జనార్థన్ రెడ్డికి 47 శాతం ఓట్లు వస్తాయని సర్వేలో వెల్లడైంది. కాంగ్రెస్ అభ్యర్థి కూచుకుళ్ల రాజేశ్ రెడ్డి 41 శాతం ఓట్లు సాధిస్తారని తేలింది.
పెరుగుతున్న వ్యతిరేకత
నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో ప్రస్తుతానికి బీఆర్ఎస్ అభ్యర్థి మర్రి జనార్ధన్ రెడ్డివైపే ఎడ్జ్ కనిపిస్తోంది. గత సర్వే కంటే 2 శాతం ఓట్లు అతనికి ప్లస్ అయ్యాయి. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ కూడా పుంజుకుంటోంది. కూచుకుళ్ల రాజేశ్ రెడ్డికి కూడా ఓటర్ల ఆదరణ పెరుగుతోంది. ఆయన కూడా రెండు శాతం ఓట్లు అదనంగా గెయిన్ అయ్యాయి. బీఎస్పీకి ఒక శాతం ఓట్ షేర్ పెరుగుతోంది.
బీఆర్ఎస్ కు ప్రజా వ్యతిరేకత ఎదురవుతుండగా, మర్రి జనార్ధన్ రెడ్డి వ్యక్తిగత సేవా కార్యక్రమాలు కొంత వరకు ప్లస్ అవుతున్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారెంటీలు ఆ పార్టీకి ప్రజల్లో ఆదరణ పెరిగేలా చేస్తున్నాయి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే నాగర్ కర్నూలులో విజయం మర్రి జనార్ధన్ రెడ్డివైపే ఉండనుందని బిగ్ టీవీ సర్వేలో తేలింది. అదర్స్ లో 12 శాతం ఓట్లు ఉండగా.. అందులో 8 శాతం ఓట్లు బీఎస్పీ ఖాతాలోకి వెళ్తున్నాయి.
.
.