Diwali Bonus : భారతదేశంలో దసరా, దీపావళి పండుగల సమయంలో కంపెనీలు తమ ఉద్యోగులకు బోనస్ ఇవ్వడం సాంప్రదాయం. కొన్ని కంపెనీలు స్వీట్ బాక్సులు, డ్రై ఫ్రూట్ కానుకలు, షాపింగ్ కూపన్లు ఇస్తే మరికొన్ని నగదు రూపంలో ఇస్తాయి. కానీ వింతగా ఒక కంపెనీ యజమాని తన ఉద్యోగులకు బుల్లెట్ బైక్లను కానుకగా ఇచ్చాడు. మరొక కంపెనీ ఓనర్ అయితే ఏకంగా కార్లనే గిఫ్ట్గా ఇచ్చాడు.
Diwali Bonus : భారతదేశంలో దసరా, దీపావళి పండుగల సమయంలో కంపెనీలు తమ ఉద్యోగులకు బోనస్ ఇవ్వడం సాంప్రదాయం. కొన్ని కంపెనీలు స్వీట్ బాక్సులు, డ్రై ఫ్రూట్ కానుకలు, షాపింగ్ కూపన్లు ఇస్తే మరికొన్ని నగదు రూపంలో ఇస్తాయి. కానీ వింతగా ఒక కంపెనీ యజమాని తన ఉద్యోగులకు బుల్లెట్ బైక్లను కానుకగా ఇచ్చాడు. మరొక కంపెనీ ఓనర్ అయితే ఏకంగా కార్లనే గిఫ్ట్గా ఇచ్చాడు.
వివరాల్లోకి వెళితే.. తమిళనాడు రాష్ట్రంలోని కోటగిరి నగరంలో ఉన్న ఒక టీ ఫార్మ్ యజమాని తన ఉద్యోగులతో పండుగ సంతోషం పంచుకునేందుకు వారికి రాయల్ ఎన్ఫీల్డ్ బైక్లను కానుకగా ఇచ్చాడు. మరోవైపు హర్యాణాలోని ఒక ఫార్మా కంపెనీ ఓనర్ తన సంస్థలో పని చేస్తున్న ఉద్యోగులలో బెస్ట పర్ఫార్మర్లను ఎంపిక చేసి 12 కార్లు గిఫ్ట్ చేశాడు.
తమిళనాడు కోటగిరిలో ఉన్న 190 ఎకరాల పెద్ద టీ తోట యజమాని శివకుమార్ గత సంవత్సరం దీపావళి పండుగ సందర్భంగా తన ఉద్యోగులకు మిక్సీలు, కుక్కర్లు, నగదు కానుకలను ఇచ్చాడు. కానీ ఈ సారి శివకుమార్ తన ఉద్యోగులలో 15 మందికి బుల్లెట్ బండ్లను కొనిచ్చాడు. శివకుమార్ సంస్థలో మొత్తం 627 మంది ఉద్యోగులు ఉన్నారు.
మరోవైపు హర్యానాలోని పంచకులా ప్రాంతంలో ఉన్న మిటస్ హెల్త్కేర్ అనే మందుల కంపెనీ ఓనర్ తన కంపెనీలోని ఉద్యోగులలో బాగా పనిచేసిన 12 మందిని ఎంపిక చేసి వారికి కార్లను కానుక రూపంలో ఇచ్చింది. వచ్చే ఏడాది ఇలాగే 38 మందికి కార్లు ఇస్తామని కంపెనీ మెనేజింగ్ డైరెక్టర్ తెలిపారు.
కంపెనీ యజమానులు తమకు ఇలాంటి ఖరీదైన కానుకలు ఇవ్వడంతో ఉద్యోగులు డబుల్ పండుగ చేసుకుంటున్నారు. వారు తమ సంతోషాన్ని సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు.