Mulugu : తెలంగాణ ఎన్నికలపై బిగ్ టీవీ చేపట్టిన సర్వేలో ఫలితాలపై ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. ములుగు జిల్లా ములుగు నియోజకవర్గంపై తాజాగా చేపట్టిన సర్వేలో ఓటర్ల తీర్పు ఎటువైపు ఉందో స్పష్టంగా తెలుస్తోంది. ఈ సెగ్మెంట్ లో 2,21,095 ఓట్లు ఉన్నాయి. అందులో పురుషులు 1,08,588 మంది ఉండగా.. మహిళా ఓటర్లు 1,12,277 మంది ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం సీతక్క ఎమ్మెల్యేగా ఉన్నారు.
బిగ్ టీవీ సర్వే.. పందెం కోళ్లు-1 (18.08.2023)
బీఆర్ఎస్ అభ్యర్థి బడే నాగజ్యోతికి 43 శాతం ఓట్లు సాధిస్తారని బిగ్ టీవీ చేసిన పందెం కోళ్లు-1 సర్వేలో తేలింది. కాంగ్రెస్ అభ్యర్థిగా సీతక్క బరిలోకి దిగితే 49 శాతం ఓట్లు సాధిస్తారని వెల్లడైంది. ఇక్కడ బీజేపీకి 3, ఇతరులకు 5 శాతం ఓట్లు పడుతాయని తేలింది.
బిగ్ టీవీ సర్వే.. పందెం కోళ్లు-2 (04-11-2023)..
తాజాగా బిగ్ టీవీ చేసిన బిగ్ టీవీ సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బడే నాగజ్యోతికి 41 శాతం ఓట్లు వస్తాయని సర్వేలో వెల్లడైంది. కాంగ్రెస్ అభ్యర్థి పాయం వెంకటేశ్వర్లుకు 51 శాతం, బీజేపీకి 5, ఇతరులకు 3 శాతం ఓట్లు వస్తాయని తేలింది.
మారుతున్న లెక్కలు..
రెండు సర్వేల ఆధారంగా ఓట్ల లెక్కలు పరిశీలిస్తే బీఆర్ఎస్ కు 2 శాతం ఓట్లు తగ్గుతుండగా.. కాంగ్రెస్ కు, బీజేపీకి 2 శాతం ఓట్లు ఓట్లు పెరుగుతున్నట్లు స్పష్టంగా తేలింది. కాంగ్రెస్ దే తుది గెలుపుగా తెలుస్తోంది.
పందెం కోళ్లు 1 , 2 రెండు సర్వేల్లోనూ అభ్యర్థులు సేమ్ క్యాండిడేట్లకే టిక్కెట్లు దక్కాయి. బడే నాగజ్యోతికి కొంత వ్యతిరేకత కనిపిస్తోంది. ఆమెకి గతంలో చేసిన సర్వే కంటే 2 శాతం ఓట్లు తగ్గుతున్నాయి. ఇదే సమయంలో సీతక్కకి మరో రెండు శాతం ఓట్లు పెరిగి ఏకంగా 51 శాతం ఓట్ షేర్ దక్కనుందని బిగ్ టీవీ ఎలకన్ సర్వేలో ఓటర్ల అభిప్రాయంగా కనిపించింది. బడే నాగజ్యోతికి.. సీతక్కకి మధ్య 10 శాతం ఓట్ షేర్ తేడా ఉంది.
.
.