Varun Tej -Lavanya Wedding : మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి నవంబర్ 1 న పెద్దల సాక్షిగా ఇటలీలో ఒక్కటైన సంగతి తెలిసిందే. గుట్టుగా జరిపిన ప్రేమాయణాన్ని ఎట్టకేలకు పెళ్లి పీటల వరకు తీసుకురావడంలో ఈ జంట సక్సెస్ అయ్యారు. సినిమా ఇండస్ట్రీ నుంచి పలువురు పెద్దలు శుభాకాంక్షలు తో పాటు బహుమానాలు కూడా అందించారు. ఈ నేపథ్యంలో బాలయ్య వీరి కోసం ఒక మంచి స్పెషల్ గిఫ్ట్ పంపించారట.బాలయ్య పంపిన ఈ గిఫ్ట్ ఆ జంటకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే విధంగా ఉంటుందని టాక్. ఇంతకీ ఆ గిఫ్ట్ ఏమిటి? స్పెషల్ గా బాలయ్య ఆ గిఫ్ట్ ఎందుకు పంపారు? తెలుసుకుందాం పదండి.
ప్రస్తుతం టాలీవుడ్ లో మెగా వారి పెళ్లి సందడి ఘనంగా వినిపిస్తోంది. పెళ్లి అనుకుంది మొదలు సోషల్ మీడియా వీళ్ళకి సంబంధించిన ఫోటోల తోటే నిండిపోయింది. తమ ప్రేమకు పునాది వేసిన ఇటలీలోని పెళ్లి ప్రమాణాలు చేయడానికి ఈ జంట నిర్ణయించుకోవడంతో కుటుంబ సభ్యులు కూడా దానికి తగినట్లుగానే ఏర్పాట్లు అంగరంగ వైభవంగా జరిపించారు. ఇటలీలో పెళ్లి పనులు పూర్తి చేసుకొని ఇండియాకి తిరిగి వచ్చిన మెగా వారి కుటుంబం ఈరోజు ఇండియాలో రిసెప్షన్ ఏర్పాటు చేస్తోంది.
ఈ నేపథ్యంలో బాలకృష్ణ కొత్త జంటకి కొత్త జీవితానికి అభినందనలు తెలుపుతూ గిఫ్ట్ పంపించడం జరిగింది. ఈ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది ఇటలీ నుంచి నిన్న హైదరాబాద్ కు చేరుకున్న ఈ జంటకు బాలయ్య ఈ స్పెషల్ గిఫ్ట్ పంపడం జరిగింది. దీంతో నూతన వధూవరులకు అదిరిపోయే గిఫ్ట్ పంపాడు బాలయ్య అంటూ సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నారు నెటిజన్స్.
ఇంతకీ ఆ గిఫ్ట్ ఏమిటంటే.. నాగబాబు ఆయన భార్య ఇద్దరు వెంకటేశ్వర స్వామి భక్తులు. ఎక్కువగా వెంకటేశ్వర స్వామి ఆరాధిస్తూ ఉంటారు. ఇక వరుణ్ తేజ్ కూడా వెంకటేశ్వర స్వామి పై మక్కువ ఎక్కువే.. కాబట్టి వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పెద్ద ఫోటోగ్రాఫర్ చేయించి బాలయ్య కొత్తజంటకు గిఫ్ట్ పంపించారట.
స్పెషల్ గా ఎంతో ఆకర్షణీయంగా ఉండే వెంకటేశ్వర స్వామి ఫోటో ను గిఫ్ట్ గా పంపడమే కాకుండా.. మీరు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి అంటూ తన బ్లెస్సింగ్స్ ని గ్రీటింగ్ కార్డు రూపంలో పంపించాడు బాలకృష్ణ. నిజంగా బాలకృష్ణ తలుచుకుంటే కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి కూడా గిఫ్ట్ పంపించగలరు. కానీ దేవుడి ఆశీర్వాదం అన్నిటికంటే గొప్పది అని భావించాడు ..కాబట్టి వరుణ్ కి ఫేవరెట్ దేవుడిని గిఫ్ట్ రూపంలో పంపించాడు అంటూ నందమూరి అభిమానులు బాలయ్యను తెగ పొగిడేస్తున్నారు.
మెగా వారి రిసెప్షన్ ఈరోజు సాయంత్రం మాదాపూర్ లో జరగనుంది. ఈ వేడుకకు సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నారు.