Musheerabad Assembly Constituency : తెలంగాణ ఎన్నికలపై బిగ్ టీవీ చేపట్టిన సర్వేలో ఫలితాలపై ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. హైదరాబాద్ జిల్లా ముషీరాబాద్ నియోజకవర్గంపై తాజా సర్వే చేసింది. ఈ సెగ్మెంట్ లో 2,94,170 ఓట్లు ఉన్నాయి. అందులో పురుషులు 1,51,494 మంది ఉన్నారు. మహిళలు 1,42,641 మంది ఉన్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే ముఠా గోపాల్.
బిగ్ టీవీ సర్వే.. పందెం కోళ్లు-1 ( 20-09-2023)..
బీఆర్ఎస్ అభ్యర్థి ముఠా గోపాల్ 38 శాతం ఓట్లు సాధిస్తారని బిగ్ టీవీ చేసిన పందెం కోళ్లు-1 సర్వేలో తేలింది. కాంగ్రెస్ అభ్యర్థిగా అంజన్ కుమార్ యాదవ్ బరిలోకి దిగితే 39 శాతం ఓట్లు సాధిస్తారని వెల్లడైంది. బీజేపీకి 20 శాతం ఓట్లు వస్తాయని సర్వే తేల్చింది.
బిగ్ టీవీ సర్వే.. పందెం కోళ్లు-2 (04-11-2023)..
తాజాగా బిగ్ టీవీ చేసిన బిగ్ టీవీ సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ముఠాగోపాల్ కు 37 శాతం ఓట్లు వస్తాయని సర్వేలో వెల్లడైంది. కాంగ్రెస్ అభ్యర్థి అంజన్ కుమార్ యాదవ్ 43 శాతం ఓట్లు సాధిస్తారని తేలింది. బీజేపీకి 16 శాతం ఓట్లు పోల్ అవుతాయని సర్వేలో తేలింది.
లెక్కలు మారుతున్నాయి..
రెండు సర్వేల ఆధారంగా ఓట్ల లెక్కలు పరిశీలిస్తే బీఆర్ఎస్ కు ఓట్ల శాతం తగ్గుతుంది. అదే సమయంలో కాంగ్రెస్ బలం మరింత పెరిగిందని స్పష్టంగా తేలింది. బీఆర్ఎస్ 1 శాతం ఓట్లను కోల్పోతుండగా.. కాంగ్రెస్ కు 4 శాతం ఓట్లు పెరుగుతున్నాయి. బీజేపీకి 4 శాతం ఓట్లు తగ్గుతున్నాయి.
బీఆర్ఎస్ వ్యతిరేకత ముషీరాబాద్ లో ముఠాగోపాల్ ఓట్ షేర్ ను దెబ్బతీస్తోంది. పందెంకోళ్లు 1 సర్వే చేసిన సమయం కంటే ఇప్పుడు 1 శాతం ఓట్లు తగ్గిపోయాయి. అంజన్ కుమార్ యాదవ్ కు ఏకంగా 4 శాతం ఓట్ షేర్ పెరిగింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 43 శాతం ఓట్లతో అంజన్ కుమార్ యాదవ్ కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధిస్తారని బిగ్ టీవీ సర్వేలో తేలింది. బీజేపీ అభ్యర్థికి గతంలో 20 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉంటే.. బీ టీమ్ ఆరోపణలతో 4 శాతం ఓట్లు తగ్గిపోయాయి.