Gunmen Suicide : తెలంగాణ మంత్రి సబిత ఇంద్రారెడ్డి గన్ మెన్ AR ఎస్సై ఫజల్ అలీ బలవన్మరణానికి పాల్పడ్డారు. తన సర్వీస్ రివాల్వర్ తో పాయింట్ బ్లాక్ లో కాల్చుకొని అయన ఆత్మహత్య చేసుకున్నారు. హైదరాబాద్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. శ్రీనగర్ కాలనీలోని మణికంఠ హోటల్లో ఫజల్ సూసైడ్ చేసుకున్నారు.ఘటనాస్థలాన్ని మంత్రి సబిత, వెస్ట్ జోన్ డీసీపీ జోయల్ డేవిస్ పరిశీలించారు.
కుటుంబ సభ్యులతో అయన మాట్లాడిన తర్వాత ఆత్మహత్య చేసుకున్నట్లు ఉన్నతాధికారులు తెలిపారు. ఫజల్ ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు.ఆర్థిక ఇబ్బందులే ఆత్మహత్యకు కారణం అని పోలీసులు తెలిపారు. ఇటీవల కాలంలో పలు బ్యాంకుల నుంచి ఫజల్ అలీ లోన్ తీసుకున్నారు. లోన్ రికవరీ వేధింపులు తాళలేక గన్ తో ఫైర్ చేసుకున్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.