Hardik Pandya : భారత క్రికెట్ అభిమానులకు షాక్! హార్దిక్ పాండ్యా వరల్డ్ కప్కు దూరం అవుతున్నట్లు ఐసీసీ శనివారం ప్రకటించింది. అతని స్థానంలో పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ భారత జట్టులోకి వచ్చాడు. గత నెలలో పూణెలో బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో బౌలింగ్ చేస్తున్నప్పుడు పాండ్యా ఎడమ చీలమండకు గాయమైంది. అతను బెంగుళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ రీహాబిలిటేషన్లో ఉన్నాడు. అతను ప్రస్తుతం జరుగుతున్న టోర్నమెంట్లో ఇకపై పాల్గొనలేడని ఐసీసీ నిర్దారించింది.
ప్రసిద్ధ్ కృష్ణ ఇప్పటివరకు 17 వన్డేలు ఆడాడు. పాండ్యాని ప్రసిద్ధ్ కృష్ణతో రీప్లేస్ చేస్తున్నట్లు ఐసీసీ టెక్నికల్ కమిటీ తెలిపింది. జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్తో కూడిన పేస్ దళానికి ప్రసిద్ తోడవడంతో భారత పేస్ బలం మరింత పటిష్టం అయ్యింది.
పాండ్యా వ్యవహారాన్ని జట్టు మేనేజ్మెంట్, భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) గోప్యంగా ఉంచింది. ఇది చిన్న సమస్య మాత్రమేనని, అతను త్వరగా తిరిగి వస్తాడని తెలిపారు. ధర్మశాలలో న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్కు అతను గైర్హాజరైనందున, ఇంగ్లండ్తో జరిగే మ్యాచ్కి అతను తిరిగి జట్టులోకి వస్తాడని BCCI తన వంతుగా ప్రకటించిన సంగతి తెలిసిందే.
శ్రీలంక మ్యాచ్కు ముందే పాండ్యా ఎన్సీఏ నుంచి ముంబైకి తిరిగి వచ్చాడనే చర్చ కొనసాగింది. అయితే, అతను జట్టులో చేరలేదు. అతను శుక్రవారం స్క్వాడ్తో కలిసి కోల్కతాకు వెళ్తాడని ఊహించారు కానీ అలా జరగలేదు. భారత్ ఇప్పటికే సెమీఫైనల్కు అర్హత సాధించినందున, అతనిని ఆడించడానికి టీమ్ మేనేజ్మెంట్ తొందరపడలేదని చర్చ కొనసాగింది. కానీ ఆశ్చర్యకరంగా శనివారం ఉదయం అతని స్థానంలో ప్రసిద్ధ్ కృష్ణను అకస్మాత్తుగా ప్రకటించడం క్రికెట్ అభిమానులను షాక్కు గురి చేసింది.