Kotha Prabhakar Reddy | దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డిపై జరిగిన హత్యాయత్నం ఘటనను మంత్రి కేటీఆర్ ఖండించారు. ఈ నేపథ్యంలో ఆయన ట్విట్టర్లో ఓ పోస్ట చేశారు.
Kotha Prabhakar Reddy | దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డిపై జరిగిన హత్యాయత్నం ఘటనను మంత్రి కేటీఆర్ ఖండించారు. ఈ నేపథ్యంలో ఆయన ట్విట్టర్లో ఓ పోస్ట చేశారు.
‘కొత్త ప్రభాకర్రెడ్డిపై జరిగిన కాంగ్రెస్ గూండాల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. తెలంగాణ నాయకులపై కాంగ్రెస్ పార్టీ భౌతిక దాడులకు ప్రయత్నిస్తోంది. ఒక థర్డ్ రేటెడ్ క్రిమినల్ అయిన టీపీసీసీ అధ్యక్షుడి నుంచి ఏం ఆశించగలం. ఎన్నికల్లో ఓటమి ఖాయమని తెలిసి కాంగ్రెస్ పార్టీ మా నాయకులపై భౌతిక దాడులకు దిగి వారిని అంతమొందించాలని చూస్తోంది. మన ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదు. ఈ ఘటనపై ఎన్నికల సంఘం సీరియస్గా స్పందిస్తుందని ఆశిస్తున్నాను.’ అని ట్వీట్ చేశారు.