Revanth Reddy : కేసీఆర్, కేటీఆర్పై టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ నేతల ఫోన్లను ట్యాప్ చేయడంతోపాటు హ్యాక్ చేస్తున్నారని మండిపడ్డారు. ఫోన్లు ట్యాపింగ్ చేయడంతోపాటు హ్యాకర్ల ద్వారా తమ ఫోన్లు హ్యాక్ చేసి… ప్రైవేట్గా మాట్లాడుకున్న సంభాషణలను వింటున్నారని రేవంత్ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీతో టచ్ లో ఉన్న నేతలను బెదిరిస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్కు ఎవరూ సాయం చేయకుండా కేటీఆర్ బెదిరిస్తున్నారని రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ను నియంత్రించాలని కేసీఆర్, కేటీఆర్ ప్రయత్నిస్తున్నారని రేవంత్ ఆరోపించారు. ఈ విషయంలో తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. సీట్లు, ఓట్లు కంటే… ఒక గొప్ప లక్ష్యం కోసం కలిసి పనిచేస్తున్నామని స్పష్టం చేశారు. ఒక నియంతను గద్దె దించి ప్రజాపాలన తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. కేసీఆర్ ప్రైవేట్ సైన్యంపై అధికారంలోకి వచ్చాక చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.