EPAPER
Kirrak Couples Episode 1

Nara Bhuvaneswari : “నిజం గెలవాలి”.. బాధితులకు భువనేశ్వరి భరోసా

Nara Bhuvaneswari : “నిజం గెలవాలి”.. బాధితులకు భువనేశ్వరి భరోసా

Nara Bhuvaneswari : తిరుపతి జిల్లాలో మొట్టమొదటి బహిరంగ సభ నిర్వహించేందుకు రెడీ అయ్యారు టీడీపీ అధినేత చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి. “నిజం గెలవాలి” పేరుతో బుధవారం నుంచి తిరుపతి జిల్లాలో నారా భువనేశ్వరి యాత్ర చేపట్టారు. చంద్రగిరి నియోజకవర్గంలో రెండు మండలాల్లో చంద్రబాబు అరెస్ట్ తర్వాత.. ఆవేదనతో మరణించిన వారి కుటుంబ సభ్యులను నారా భువనేశ్వరి పరామర్శించారు. చంద్రగిరిలో ఎ.ప్రవీణ్ రెడ్డి, నేండ్రగుంటలో కె. చిన్నబ్బ కుటుంబాలను భువనేశ్వరి పరామర్శించి ఓదార్చారు. ఇరు కుటుంబాల కుటుంబ సభ్యులకు చెరో రూ.3 లక్షల చెక్కులను అందజేశారు.


ధైర్యంగా ఉండాలని, టీడీపీ అండగా ఉంటుందని భువనేశ్వరి భరోసా ఇచ్చారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. కష్టకాలంలో పార్టీకి అండగా ఉన్న ప్రతి ఒక్కరి బాధ్యత టీడీపీనే తీసుకుంటుందని తెలిపారు. చంద్రగిరి మండలం అగరాల వద్ద జరిగే బహిరంగ సభలో భువనేశ్వరి ప్రసంగించనున్నారు. కాగా.. వారంలో మూడురోజుల పాటు “నిజం గెలవాలి” యాత్ర జరగనుంది. యాత్ర నిర్వహించిన ప్రాంతాల్లో జరిగే సభలు, సమావేశాల్లో నారా భువనేశ్వరి పాల్గొని ప్రసంగిస్తారు.

చంద్రబాబునాయుడు అరెస్ట్ తర్వాత ఏపీలో రాజకీయ సమీకరణాలు మారాయి. అప్పటి వరకూ బీజేపీతో కలిసి పోటీచేస్తుందనుకున్న జనసేన.. టీడీపీతో పొత్తు ప్రకటించింది. సుప్రీంకోర్టు, ఏసీబీ కోర్టు, హైకోర్టుల్లో బాబు బెయిల్ పిటిషన్లపై వాదోపవాదాలు.. వాయిదాల పర్వాల నడుమ నారా భువనేశ్వరి “నిజం గెలవాలి” అనే యాత్ర నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. చంద్రబాబు నాయుడిని అక్రమంగా అరెస్ట్ చేశారని, ఆయన కడిగిన ముత్యంలా తిరిగి వస్తారని టీడీపీ శ్రేణులు చెబుతున్నారు.


Related News

Ongole: ఒంగోలులో ఉద్రిక్తత.. జనసేన ఫ్లెక్సీని తొలగించిన టీడీపీ శ్రేణులు

Pawan Kalyan: ఏడుకొండలవాడా, క్షమించు.. పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం, ఇక 11 రోజులపాటూ..

Nandamuri Mohan Roopa: వరదల బాధితుల కోసం నందమూరి మోహన్ రూప భారీ విరాళం

Tirupati Ladddu Row: లడ్డూ కల్తీపై జగన్ ఎంక్వైరీ కోరడమేంటి? అప్పుడు అధికారంలో ఉన్నది ఆయనే కదా? : షర్మిల

Janasena Joinings: ఇట్స్ అఫీషియల్.. ఆ ఇద్దరి చేరికను కన్ఫర్మ్ చేసిన జనసేన

MP Vijayasai Reddy: విజయ సాయిరెడ్డి అక్రమ నిర్మాణాల కూల్చివేత.. చంద్రబాబుపై మండిపాటు

Tirumala Laddu Row: తిరుమల లడ్డూ వివాదం, విచారణ ఆపాలంటూ సుబ్బారెడ్డి పిటిషన్, సాయంత్రానికి రిపోర్ట్

Big Stories

×